AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యపై పగబట్టిన బట్టిన భర్త.. ఆమె చనిపోయిన తర్వాత కూడా.. 48ఏళ్లుగా కసి తీర్చుకుంటున్నాడు..

ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించారు. తమ వద్ద సరైన ఆధారాలు లేకపోవటంతో జరిగినదంతా మర్ఫీ మీడియాకు తెలిపారు.

భార్యపై పగబట్టిన బట్టిన భర్త.. ఆమె చనిపోయిన తర్వాత కూడా..  48ఏళ్లుగా కసి తీర్చుకుంటున్నాడు..
Husband Grave
Jyothi Gadda
|

Updated on: Jan 31, 2023 | 9:12 AM

Share

48 ఏళ్లుగా తన భార్యపై పగ తీర్చుకునేందుకు ఓ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముకుంటాయి. ఎందుకంటే ఈ వ్యక్తి తన చనిపోయిన భార్యను ఇప్పటికీ ద్వేషిస్తున్నాడు. అది కూడా అతి హీనంగా, భయానకంగా పగ తీర్చుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే..

43 ఏళ్ల మైఖేల్ ఆండ్రూ మర్ఫీ ప్రతిరోజూ తన తల్లి సమాధి దగ్గర ఎవరో మూత్ర విసర్జన చేయడం చూశాడు. మొదట అది జంతువులు చేసిన పనిగా భావించి మౌనంగా ఉన్నాడు. కానీ, తరచూ ఇదే తంతు జరుగుతోంది. ఈ క్రమంలోనే శ్మశానవాటికలో కెమెరా ఏర్పాటు చేయాలని భావించి శ్మశానవాటిక సంరక్షకుడి నుంచి అనుమతి తీసుకున్నారు. అనంతరం చుట్టుపక్కల చెట్లకు కెమెరాలను పెట్టారు.

మరుసటి రోజు సంగ్రహించిన ఫుటేజీలో ఒక వ్యక్తి సమాధిపై మూత్ర విసర్జన చేస్తున్నట్లు చూపించారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, చనిపోయిన ఆ సమాధిలోని మహిళ భర్త అని గుర్తించారు. మైఖేల్ ఆండ్రూ మర్ఫీ తల్లి టోరెల్లో (66) 2017లో క్యాన్సర్‌తో మరణించారు. న్యూయార్క్‌లోని ఆరంజ్‌టౌన్‌లోని టప్పన్ రిఫార్మ్డ్ చర్చి స్మశానవాటికలో ఆమెను ఖననం చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించారు. తమ వద్ద సరైన ఆధారాలు లేకపోవటంతో జరిగినదంతా మర్ఫీ మీడియాకు తెలిపారు. ఆ తర్వాత, మర్ఫీ, అతని సోదరి స్మశానవాటిక వద్ద నిలబడి, మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ఫోటోలు తీశారు. ఇప్పుడు ఆ ఫోటో సర్వత్రా వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరుసటి రోజు సంగ్రహించిన ఫుటేజీలో ఒక వ్యక్తి సమాధిపై మూత్ర విసర్జన చేస్తున్నట్లు చూపించారు. విచారణ జరిపిన తర్వాత షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సమాధిపై మూత్రవిసర్జన చేస్తున్న ఆ వ్యక్తి మరెవరో కాదు చనిపోయిన సమాధిలోని మహిళ భర్తగా గుర్తించారు. ఆమె మైఖేల్‌, ఆండ్రూ తల్లి. తమ తల్లి టోరెల్లో (66) 2017లో క్యాన్సర్‌తో మరణించారు. అతన్ని న్యూయార్క్‌లోని ఆరంజ్‌టౌన్‌లోని టప్పన్ రిఫార్మ్డ్ చర్చి స్మశానవాటికలో ఖననం చేశారు.ఆమె బతికి ఉన్న రోజుల్లో కొన్నాళ్లుగా భార్యపై ఆ వ్యక్తి పగతో ఉండేవాడని చెప్పారు. ఆమె చనిపోయిన తర్వాత కూడా అదే పగతో ప్రతి రోజూ ఉదయం 6 గంటలకే శ్మశాన వాటిక వద్దకు వచ్చి సమాధిపై మూత్ర విసర్జన చేసేవాడని తేల్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..