Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: ఆగస్టులో తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెల రోజులపాటు పుష్కరిణి మూసివేత.. ఎందుకంటే..

పుష్కరిణి మ‌ర‌మ్మతుల కోసం మొద‌టి ప‌ది రోజుల పాటు నీటిని తొలగిస్తారు.. ఆ త‌రువాత ప‌ది రోజులు మ‌ర‌మ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేయడం జరుగుతుంది., చివ‌రి ప‌ది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారని టీటీడీ అధికారులు తెలిపారు. పుష్కరిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారని వివరించారు.

Tirumala: ఆగస్టులో తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెల రోజులపాటు పుష్కరిణి మూసివేత.. ఎందుకంటే..
Srivari Pushkarini
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 30, 2024 | 3:39 PM

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో శ్రీవారి పుష్కరిణిని మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.. ఆగస్టు ఒకటో తేదీ నుంచి 31 వరకు పుష్కరణిని మూసివేయనున్నుట్టు తెలిపింది. టీటీడీ వాట‌ర్ వ‌ర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిలోని నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హార‌తి ఉండ‌దని వివరించారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణి మరమ్మతులు, శుభ్రత పనులు చేపట్టడం ఆనవాయితీ.

సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవ‌కాశం లేదని, పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవ‌స్థ అందుబాటులో ఉందని టీటీడీ సిబ్బంది చెప్పారు. నిరంత‌రాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించడం జరుగుతుందన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొల‌గించి చిన్న చిన్న మ‌ర‌మ్మతుల‌ను చేపట్టి పూర్తి చేస్తామన్నారు.

పుష్కరిణి మ‌ర‌మ్మతుల కోసం మొద‌టి ప‌ది రోజుల పాటు నీటిని తొలగిస్తారు.. ఆ త‌రువాత ప‌ది రోజులు మ‌ర‌మ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేయడం జరుగుతుంది., చివ‌రి ప‌ది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారని టీటీడీ అధికారులు తెలిపారు. పుష్కరిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..