AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భాగ్యనగరంలో ఘనంగా ఆషాడ బోనాలు.. లాల్‌దర్వాజ రంగంలో అమ్మవారు చెప్పిన భవిష్యవాణి..!

దాదాపు 2 వేల మందికి పైగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. నెలరోజుల పాటు జరిగిన ఆషాఢం మాస బోనాల జాతరలో చివరిది లాల్ దర్వాజా బోనాల ఉత్సవం. ఆగస్టు 4న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి చివరి బోనం సమర్పణతో బోనాలు ఉత్సవాలు ముగుస్తాయి.

భాగ్యనగరంలో ఘనంగా ఆషాడ బోనాలు.. లాల్‌దర్వాజ రంగంలో అమ్మవారు చెప్పిన భవిష్యవాణి..!
Bonalu
Jyothi Gadda
|

Updated on: Jul 29, 2024 | 10:14 PM

Share

భాగ్యనగరంలో బోనాల జాతర అంగరవైభంగా జరిగాయి. బోనాల జాతరతో వీధి వీధిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భాగ్యలక్ష్మి బోనాల జాతర రెండోరోజు ఘనంగా జరిగింది. ఘటాల , ఏనుగు అంబారి ఊరేగింపు కన్నుల పండుగా సాగింది. దీంతో చార్మినార్‌ పరిసరాలు భక్తులతో కిక్కిరిసాయి. పోతరాజుల ఆటపాటలు ఘటాల ఊరేగింపుతో పాత బస్తీ మరుమ్రోగిపోయింది.

మరోవైపు భాగ్యనగరంలో లాల్​ దర్వాజ్​ బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పుదరువులతో సిటీ బస్తీలన్నీ దద్దరిల్లాయి. ప్రతిష్టాత్మక లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయానికి భక్తులు పోటెత్తారు. లాల్‌దర్వాజలో రంగం కార్యక్రమం నిర్వహించారు.

భాగ్యలక్ష్మి అమ్మవారి టెంఫుల్ దగ్గర బోనాల జాతరకు పోలీసులు పటిష్ట బందోబస్తు పెట్టారు. దాదాపు 2 వేల మందికి పైగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. నెలరోజుల పాటు జరిగిన ఆషాఢం మాస బోనాల జాతరలో చివరిది లాల్ దర్వాజా బోనాల ఉత్సవం. ఆగస్టు 4న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి చివరి బోనం సమర్పణతో బోనాలు ఉత్సవాలు ముగుస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..