AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే అదిరిపోయే గిఫ్ట్.. ఏంటో తెలిస్తే..

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ప్రైవేటు విద్యాసంస్థలతో పోటీ పడేలా మౌళిక సదుపాయాలు కల్పిస్తుంది. ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్ధులను ప్రోత్సహిస్తూ స్థానిక ఎమ్మెల్యే కూడా రంగంలోకి దిగారు. ఈ నెల 16వ తేది నుండి పరీక్షలు నేపథ్యంలో వీరిలో ఉత్సాహం, పోటీ తత్వం నింపేందుకు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి బంపర్ ఆఫర్ ఇచ్చారు.

విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే అదిరిపోయే గిఫ్ట్.. ఏంటో తెలిస్తే..
Mla Madhavi Motivates 10th Graders
T Nagaraju
| Edited By: |

Updated on: Mar 01, 2026 | 11:12 AM

Share

గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలో అతి పెద్ద ప్రభుత్వ పాఠశాల ఏటి అగ్రహారంలో ఉంది. ఈ పాఠశాల విద్యార్ధులకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే మాధవి దంపతులు స్కూల్ కు వెళ్లారు. అందరూ పరీక్షలు మెరుగ్గా రాయాలని సూచించారు. కష్టపడి చదవి ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే పదో తరగతి పరీక్షలే బేస్ అని చెప్పారు. ఎమ్మెల్యే విద్యార్ధులను ప్రోత్సహిస్తూనే పదో తరగతి లో మెరుగైన ఫలితాలు సాధించిన యాభై మందిని ఎంపిక చేసి అందరిని రెండు రోజుల పాటు విహార యాత్రకు తీసుకెల్తామని తెలిపారు.

ఎస్ కేబీఎం స్కూల్ నుండే 1,328 మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వీరిలో ఉత్తమ ఫలితాలు సాధించిన యాభై మందిని ఎంపిక చేసి విహార యాత్రకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. గతంలోనూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులను విహార యాత్రకు విమానంలో తీసుకెళ్లనున్నట్లు ప్రకటించారు. అయితే మార్కులకంటే ఆత్మవిశ్వాసం ముఖ్యమని ప్రణాళిక బద్దంగా పరీక్షలు రాసి మెరుగైనా ఫలితాలు సాధించాలన్నారు ఎమ్మెల్యే.

Mla Madhavi Motivates 10th Graders (1)

Mla Madhavi Motivates 10th Graders

ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల్లో పోటీతత్వం పెంచి వారిని ఉన్నత మార్గంవైపు మళ్లించేలా ప్రోత్సహించేందుకు మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఎమ్మెల్యే దంపతులు ప్రోత్సహించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా టీచర్లు కూడా కష్టపడి పనిచేసి విద్యార్ధులందరూ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేలా చేయాలని స్థానికులు అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us