AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP Vs TDP: తిరువూరులో పొలిటికల్ టెన్షన్‌.. నేడు టీడీపీ, వైసీపీ నేతల బహిరంగ చర్చ.. ముందుస్తు అరెస్ట్‌లు

ఇప్పటికే పాదయాత్ర చేస్తోన్న లోకేష్.. కు వైసీపీ ఎమ్మెల్యకు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు సాగుతుండగా.. తాజాగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పొలిటికల్ టెన్షన్‌ పెరిగింది. సోమవారం తిరువూరులో టీడీపీ, వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యాయి.

YCP Vs TDP: తిరువూరులో పొలిటికల్ టెన్షన్‌.. నేడు టీడీపీ, వైసీపీ నేతల బహిరంగ చర్చ.. ముందుస్తు అరెస్ట్‌లు
Tdp Vs Ycp
Surya Kala
|

Updated on: Apr 24, 2023 | 7:06 AM

Share

ఏపీలో ఎన్నికలకు ముందే అధికార, ప్రతి పక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతూనే ఉంది. అధికార వైసీపీ పార్టీ నేతలు, టీడీపీ నేతలు బాహాబాహీకి దిగుతున్నారు. పందెం కోళ్లలా సై అంటున్నారు. ఇప్పటికే పాదయాత్ర చేస్తోన్న లోకేష్.. కు వైసీపీ ఎమ్మెల్యకు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు సాగుతుండగా.. తాజాగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పొలిటికల్ టెన్షన్‌ పెరిగింది. సోమవారం తిరువూరులో టీడీపీ, వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యాయి. మరి ఈ చర్చ ఏ చర్చకు దారితీస్తోంది..ఎంతటి గొడవ అవుతుందో అని స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో టెన్షన్‌ టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే..తిరువూరు అభివృద్ధి పై వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధికి సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్.. ఇందుకు గాను.. తిరువూరులో సోమవారం బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. మరి ఇరు పార్టీల నేతలు బహిరంగ చర్చలో ఏమేరకు పాల్గొంటారో నని తిరువూరు పబ్లిక్‌ టాక్‌. అయితే.. సవాలు విసిరిన మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వాసం మునియ్యను సహా పలువురుని ముందస్తుగా అరెస్ట్ చేశారు  తిరువూరు పోలీసులు.. అయితే ముందస్తు నోటీసు ఇవ్వకుండా పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us