Student Suicide: విజయవాడ కాలేజ్ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో పేరెంట్స్ గురించి..

అనంతపురం నగరానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని కృష్ణా జిల్లాలోని శ్రీచైతన్య కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషాదాన్ని నింపింది. అనంతపురం నగరానికి చెందిన లాస్య శ్రీ అనే విద్యార్థిని

Student Suicide: విజయవాడ కాలేజ్ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో పేరెంట్స్ గురించి..
Student Suicide
Follow us

|

Updated on: Mar 12, 2021 | 5:15 PM

అనంతపురం నగరానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని కృష్ణా జిల్లాలోని శ్రీచైతన్య కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషాదాన్ని నింపింది. అనంతపురం నగరానికి చెందిన లాస్య శ్రీ అనే విద్యార్థిని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. డాక్టర్ కావాలనే ఉద్దేశంతో లాస్య బైపీసీలో చేరింది. స్థానికంగా ఫ్యాకల్టీ సరిగా లేకపోవడంతో ఆమె కృష్ణాజిల్లాలోని కంకిపాడు పోరంకి బ్రాంచ్ శ్రీ చైతన్య లో జాయిన్ అయింది. అయితే గత ఐదు రోజులుగా కరోనా కారణంగా విద్యార్థులు కళాశాల నుంచి వెళ్లిపోతున్నారని తాను కూడా ఇంటికి వస్తానని తల్లిదండ్రులతో చెప్పింది. అయితే లాస్య తండ్రి ఆదివారం వచ్చి తీసుకెళ్తానని చెప్పారు. ఇంతలో మీ కూతురు ఆరోగ్యం సరిగాలేదని.. సీరియస్ గా ఉందంటూ తల్లిదండ్రులకు కళాశాల నుండి ఫోన్ వచ్చింది. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు హుటాహుటిన విజయవాడ చెరుకున్నారు. అయితే అప్పటికే లాస్య మృతి చెందిందని చెప్పారు. లాస్య కళాశాలలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయిందని కళాశాల యాజమాన్యం చెబుతోంది. పోస్టుమార్టం అనంతరం లాస్య మృతదేహం ఇవాళ అనంతపురం చేరుకుంది. లాస్య మృతితో కాలనీలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

కాగా ఆత్మహత్యకు ముందు విద్యార్థిని లాస్యశ్రీ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు.  హోంసిక్ వల్లే ఆత్మహత్యకు‌ పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు.  జనవరి 3వ తేదీన అనంతపురం నుంచి‌ వచ్చిన లాస్యశ్రీ చైతన్య కాలేజ్ లో జాయిన్ అయ్యింది. క్యాంపస్ వాతావరణం నచ్చలేదని, తనకు ఉండాలని లేదని పలుసార్లు తల్లిదండ్రులకు ఫోన్లు చేసింది. అయితే  లాస్యశ్రీకి తండ్రి చలపతి నచ్చజెప్పారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడి గురైన విద్యార్థిణి మార్చి 10న సాయంత్రం 6 గంటలకు హాస్టల్ గదిలో ఉరి వేసుకుంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ లో తల్లిదండ్రులు తన గురించి పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఫోన్లు చేసినా పేరెంట్స్ లిఫ్ట్ చేయడం లేదని,  మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది.  విద్యార్థి మృతిపై కమిటీ ఏర్పాటే చేసిన ప్రభుత్వం.. లోతైన దర్యాప్తు జరపాలని ఆదేశించింది.

Also Read:

5వ భార్య భర్తకు మొదట ఫోర్న్ వీడియోలు చూపించింది.. ఆ తర్వాత కాళ్లు, చేతులు కుర్చీకి కట్టింది.. చివరికి..

పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద అగ్నిప్రమాదం.. పిల్లర్లకు అంటుకున్న మంటలు.. దట్టంగా వ్యాపించిన పొగ

Latest Articles
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!