ఎన్నికలైపోయినా తగ్గని కాక.. ‘వైసీపీ మొత్తం డివిజన్లు గెలుచుకుంటే, రాజకీయాల నుంచేకాదు, విజయవాడ నుంచే వెళ్లిపోతా’

AP Municipal Election Results 2021 : ఏపీలో ఎన్నికలు ముగిసినా కాని పొలిటికల్ హీట్‌ తగ్గడం లేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేది తామంటే తామంటూ వైసీపీ, టీడీపీ నేతలు..

ఎన్నికలైపోయినా తగ్గని కాక..  'వైసీపీ మొత్తం డివిజన్లు గెలుచుకుంటే, రాజకీయాల నుంచేకాదు,  విజయవాడ నుంచే వెళ్లిపోతా'
Follow us

|

Updated on: Mar 12, 2021 | 3:46 PM

AP Municipal Election Results 2021 : ఏపీలో ఎన్నికలు ముగిసినా కాని పొలిటికల్ హీట్‌ తగ్గడం లేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేది తామంటే తామంటూ వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటూనే ఉన్నారు. విజయవాడ కార్పొరేషన్‌లో వైసీపీ మొత్తం డివిజన్లు గెలుచుకుంటే, రాజకీయాల నుంచి తప్పుకుంటామని టీడీపీ నేత బొండా ఉమా సంచలన సవాల్‌ విసిరారు. విజయవాడ నుంచే వెళ్లిపోతామన్నారు. మున్సిపల్ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా కొనసాగుతున్న పొలిటికల్ హీట్‌కు ఇదో ఎగ్జాంపుల్‌. అంతకుముందు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్టా రెడ్డి ఫలితాలపై కామెంట్స్‌ చేశారు.

వంద శాతం విజయం తమదేనన్నారు. హిస్టరీని క్రియేట్‌ చేస్తున్నామన్నారు. ఏపీలో వందకు వంద శాతం మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంటుందని, టీడీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందన్నారు సజ్జల. దానికి బోండా ఉమా కౌంటర్‌ ఇవ్వడంతో.. మరోమారు ఏపీ రాజకీయాలు రక్తికట్టించేలా మారాయి. అటు, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ వైసీపీనే ఘన విజయం సాధిస్తుందంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ నేతల అరెస్ట్‌ కక్షసాధింపు చర్యకాదన్న బొత్స.. తాము ప్రతిపక్షంలో ఉండగా చట్టాన్ని గౌరవించామన్నారు. స్టీల్‌ప్లాంట్‌ కాపాడుకునేందుకు గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ పోరాడతామన్నారు బొత్స.

Read also : AmritMahotsav : 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ 75 వారాలపాటు దేశవ్యాప్తంగా 75 కార్యక్రమాలు.. నేటి నుంచే కౌంట్ డౌన్