AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం.. ఇక నుంచి వేగంగా దస్త్రాల పరిష్కారం..

ఆంధ్రప్రదేశ్‌ సచివాయంలో పెండింగ్ లో ఉన్న దస్త్రాలను త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్రప్రభుత్వం సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి సచివాలయంలో కొత్తగా ఫైల్ జంపింగ్ విధానం..

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం.. ఇక నుంచి వేగంగా దస్త్రాల పరిష్కారం..
Ap Secretariat
Amarnadh Daneti
|

Updated on: Aug 24, 2022 | 9:39 PM

Share

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ సచివాయంలో పెండింగ్ లో ఉన్న దస్త్రాలను త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్రప్రభుత్వం సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి సచివాలయంలో కొత్తగా ఫైల్ జంపింగ్ విధానం అమలుచేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఆఫీస్‌ మ్యానువల్ బిజినెస్ నిబంధల్ని సవరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలన శాఖ ఇచ్చిన నోట్ ఆధారంగా సచివాలయ మాన్యవల్ లో మార్పులు చేస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సచివాలయంలో దస్త్రాల పరిష్కారంలో జాప్యం ఏర్పడుతుండటంతో.. ఫైళ్లు పేరుకుపోతున్నాయి. దీంతో త్వరితగతిన ఫైల్స్ ను పరిష్కరించేందుకు వీలుగా లెవల్ జంపింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకనుంచి ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలోని అనవసరమైన స్థాయిల్లో దస్త్రాలను తనిఖీ చేయడం అవసరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సహాయ సెక్షన్ అధికారి నుంచి మంత్రి వరకు నాలుగు స్థాయిల్లోనే ఫైల్స్ సర్క్యలేట్ అయితే సరిపోతుందని రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది.

అత్యవసర, ముఖ్యమైన, రహస్య కేటగిరిలతో పాటు నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాల్సిన దస్త్రాల వేగం పెంచేందుకు లెవల్ జంపింగ్ విధానం తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ మాన్యవల్ 2005 ను అనుసరించి ఈమార్పులు, చేర్పులకు అనుగుణంగా పనిని విభజించాలని స్పష్టం చేశారు. ప్రతి శాఖకు చెందిన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శుల స్థాయిలో లెవల్ జంపింగ్ ఎలా చేయించాలో సూచిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో లెవల్ జంపింగ్ విధానం వద్దని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికి దస్త్రాలను వేగవంతంగా పరిష్కరించేందుకు వీలుగా కొత్త విధానాన్ని రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..