AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎందుకు కన్నావమ్మా.. ఏడాదిలోపే రెండో బిడ్డను విక్రయించిన తల్లి.. డబ్బుల పంపకంలో తేడా రావడంతో..

కన్నబిడ్డలనే కూరగాయలు అమ్మినట్లు అమ్మేస్తుంది. ఆనక కొనుగోలు చేసిన వారితో గొడవ పడుతుంది. చివరకూ పోలీసుల వద్దకు చేరి పంచాయితీ పెడుతుంది. ఈ కన్న తల్లి వ్యవహరం వివాదాస్పదంగా మారడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. బాపట్లలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన వెంకటేశ్వరమ్మ ఒక వ్యక్తితో సహజీవనం చేస్తోంది.

ఎందుకు కన్నావమ్మా.. ఏడాదిలోపే రెండో బిడ్డను విక్రయించిన తల్లి.. డబ్బుల పంపకంలో తేడా రావడంతో..
Child Home
T Nagaraju
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Aug 10, 2025 | 1:03 PM

Share

కన్నబిడ్డలనే కూరగాయలు అమ్మినట్లు అమ్మేస్తుంది. ఆనక కొనుగోలు చేసిన వారితో గొడవ పడుతుంది. చివరకూ పోలీసుల వద్దకు చేరి పంచాయితీ పెడుతుంది. ఈ కన్న తల్లి వ్యవహరం వివాదాస్పదంగా మారడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. బాపట్లలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన వెంకటేశ్వరమ్మ ఒక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరికి రెడు నెలల కిందట ఒక పాప పుట్టింది. అయితే ఆ పాపను లక్షన్నర రూపాయలకు క్రిష్ణా జిల్లా కోడూరుకు చెందిన అద్దెపల్లి గీతకు విక్రయించారు. గీతకు పిల్లలు లేకపోవడంతో బిడ్డను కొనుగోలు చేసింది. అయితే వెంకటేశ్వరమ్మ వద్ద నుండి గీత వద్దకు పాప చేరడానికి నలుగురైదుగురు మద్యవర్తులు పనిచేశారు. లక్షన్నర రూపాయలకు వెంకటేశ్వరమ్మ ఒప్పుకొని బిడ్డను ఇస్తే ఆమెకు అరవై వేల రూపాయలు మాత్రమే దక్కింది.

దీంతో ఆమె మధ్యవర్తులతో గొడవకు దిగింది. అంతేకాకుండా బిడ్డను కొనుగోలు చేసిన గీతతోనూ ఘర్షణ పడింది. ఆ తర్వాత తన బిడ్డ సంగతి తేల్చాలంటూ రేపల్లే పోలీసులను ఆశ్రయించింది. రంగంలోని దిగిన పోలీసులు పాపను తీసుకొని బాపట్ల జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. పాపను బాల సదన్ కు చేర్చారు. వెంకటేశ్వరమ్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

పాపను విక్రయించే క్రమంలో బాపట్లకు చెందిన నూర్, జానీ, నగరం మండలం ప్రజ్నంకు చెందిన ఏడుకొండలు, అవనిగడ్డకు చెందిన లక్స్మీ మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు పోలీసులకు విచారణలో తేలింది. వీరంతా తొంభై వేల రూపాయలు పంచుకొని అరవై వేల రూపాయలను మాత్రం వెంకటేశ్వరమ్మకు ఇచ్చారు. దీంతో వెంకటేశ్వరమ్మ వారితో ఘర్షణ పడినట్లు గుర్తించారు.

అయితే.. వెంకటేశ్వరమ్మ గత ఏడాది అక్టోబర్ సమయంలోనే ఇదే విధంగా తన మొదటి బిడ్డ బాబును నెల్లూరు జిల్లా కావలికి చెందిన దంపతులకు విక్రయించింది. రెండు నెలల తర్వాత తన బిడ్డను తనకు ఇవ్వాలంటూ వారితో గొడవ పడటమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు దర్యాప్తులో మగ బిడ్డను వెంకటేశ్వరమ్మే విక్రయించినట్లు గుర్తించారు. అప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులు కొంతకాలం తర్వాత మగ బిడ్డను వెంకటేశ్వరమ్మకే ఇచ్చేశారు. ఆ బిడ్డ ప్రస్తుతం ఆమె సహజీవనం చేస్తున్న వ్యక్తి వద్దే ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

అయితే వెంకటేశ్వరమ్మ ఎందుకు శిశువులను విక్రయిస్తుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిడ్డలను కన్న రెండు నెలల్లోపే విక్రయించడంపై ఆరా తీస్తున్నారు. వీరికి సహకరించిన వారందరిపై కేసులు నమోదు చేసేందుకు బాపట్ల పోలీసులు సిద్దమయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..