AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: దిమ్మతిరిగే స్కాంను చేదించిన ఏపీ పోలీసులు.. ఇంతకీ అసలు కథేంటంటే..

ఈ కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారి దాకా అత్యవసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది సెల్ ఫోన్. ఒక్క క్షణం సెల్ ఫోన్ లేకపోతే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. అన్నం తినకపోయినా బాధ లేదు గాని సెల్ ఫోన్ లేకుండా మాత్రం బతకలేకపోతున్నారు. అలాంటిది కొనుక్కున్న ఫోన్లు పోతే ఆ బాధ అంతా కాదు. కాంటాక్ట్స్, ఫొటోస్ పోతాయి. వీటితో పాటు ఎన్నోల ఏళ్లుగా భద్రపరుచుకున్న జ్ఞాపకాలన్నీ పోతాయి.

AP News: దిమ్మతిరిగే స్కాంను చేదించిన ఏపీ పోలీసులు.. ఇంతకీ అసలు కథేంటంటే..
Kadapa Sp Siddarth Koushal
Sudhir Chappidi
| Edited By: Srikar T|

Updated on: Feb 02, 2024 | 5:35 PM

Share

కడప, ఫిబ్రవరి 2: ఈ కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారి దాకా అత్యవసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది సెల్ ఫోన్. ఒక్క క్షణం సెల్ ఫోన్ లేకపోతే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. అన్నం తినకపోయినా బాధ లేదు గాని సెల్ ఫోన్ లేకుండా మాత్రం బతకలేకపోతున్నారు. అలాంటిది కొనుక్కున్న ఫోన్లు పోతే ఆ బాధ అంతా కాదు. కాంటాక్ట్స్, ఫొటోస్ పోతాయి. వీటితో పాటు ఎన్నోల ఏళ్లుగా భద్రపరుచుకున్న జ్ఞాపకాలన్నీ పోతాయి. ఒకప్పుడు పోగొట్టుకున్న ఫోన్ దొరకాలంటే ఇక దానిపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. పోలీసులు వినియోగిస్తున్న ఆధునాతన టెక్నాలజీ ద్వారా పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసి వినియోగదారులకు అందజేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కడప జిల్లా పోలీసులు దాదాపు రెండు కోట్ల రూపాయల విలువచేసే 650 సెల్ ఫోన్‎లను రికవరీ చేసి పోగొట్టుకున్న వారికి అందజేశారు.

ఈ సందర్భంగా కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ స్పెషల్ మొబైల్ మేళా నిర్వహించామని, ఇందుకోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీఐఆర్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ప్రజలు పోగొట్టుకున్న మొబైల్స్ తిరిగి పొందవచ్చని ఆయన తెలిపారు. ఏపీలోని జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా రికవరీ చేసామని వెల్లడించారు. గత ఆరు నెలల కింద నుంచి చోరీకి గురై, పోగొట్టుకున్న మొబైల్స్ ఫోన్‎లను పోలీస్ ఐటీ సెల్ విభాగం ప్రత్యేకంగా దృష్టి సారించి వాటిని రికవరీ చేశారన్నారు.

ఆ మొబైల్ ఫోన్లను కడప పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చేతుల మీదుగా సంబంధిత బాధితులకు అందజేశారు. గతంలో కూడా ఇదే విధంగా 630 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి వినియోగదారులకు అందజేశామని ఎస్పీ తెలిపారు. ఎవరైనా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తప్పకుండా వాటిని రికవరీ చేసి ఇస్తామని ఎస్పీ వివరించారు. అయితే మొబైల్ ఫోన్లు దుకాణాల్లో కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదులు తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..