AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చేతికి పురుగు కుట్టిందని ఆస్పత్రికెళ్లగా కట్టుకట్టిన వైద్యులు.. కట్ చేస్తే.. కొద్దిరోజులకే సీన్ రివర్స్..

విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం వెలుగులోకి వచ్చింది.. చేతికి పురుగు కుట్టిందని వెళితే.. ఓ డాక్టర్ కట్టువేసి సర్జికల్ బ్లేడ్ మర్చిపోయాడు.. చివరికీ.. పాపం చేయి తీసేయాల్సిందేనని పేర్కొనడంతో బాధితురాలు లబోదిబోమంటుంది.

Andhra Pradesh: చేతికి పురుగు కుట్టిందని ఆస్పత్రికెళ్లగా కట్టుకట్టిన వైద్యులు.. కట్ చేస్తే.. కొద్దిరోజులకే సీన్ రివర్స్..
Hand Surgery
Shaik Madar Saheb
|

Updated on: Apr 08, 2023 | 7:36 AM

Share

విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం వెలుగులోకి వచ్చింది.. చేతికి పురుగు కుట్టిందని వెళితే.. ఓ డాక్టర్ కట్టువేసి సర్జికల్ బ్లేడ్ మర్చిపోయాడు.. చివరికీ.. పాపం చేయి తీసేయాల్సిందేనని పేర్కొనడంతో బాధితురాలు లబోదిబోమంటుంది. కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేట గ్రామానికి చెందిన నందిపాం సురేష్ భార్య తులసి (22) తనకున్న పూరిల్లు సర్దుకునే సమయంలో పురుగు కుట్టింది. నొప్పి ఉండటంతో ఆమె అనుమానంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లింది. వైద్యుల సూచన మేరకు.. అక్కడనుంచి ఆమెను మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తర్వాత నూజివీడు డాక్టర్ల పరిశీలించి ఇన్ఫెక్షన్ ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించారు. విజయవాడలో చేతికి ఉన్న ఇన్ఫెక్షన్ తొలగించి కట్టు కట్టారు. అయితే, కట్లు మార్చే సమయంలో (డ్రెస్సింగ్) ఓ సర్జరీ పరికరాన్ని చేతికి వేసి కట్టడంతో ఇన్ఫెక్షన్ చేతికి పూర్తిగా పాకింది. దీంతో తీవ్రమైన నొప్పితో ఆమె మళ్లీ ఆసుపత్రికి వెళ్లగా అసలు విషయం వెలుగుచూసింది.

డ్రెస్సింగ్ లేట్ గా చెయ్యటంతో.. సర్జికల్ బ్లేడ్ వల్ల ఇన్ఫెక్షన్ పెరిగింది. ఇది చూసి డాక్టర్లు ఆఖరికి చెయి తీసేయాలంటూ వెల్లడించారు. దీంతో షాకైన తులసి.. రోదిస్తూ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. ఇన్ఫెక్షన్ తొలగించి చేతికి వేసిన కట్టులో బ్లేడ్‌ మర్చిపోవడంతో చివరికి చేయిని తీసేయాలంటున్నారని.. రోదిస్తోంది. తనకు జరిగిన విషయాన్ని చెబుతూ న్యాయం చేయాలని వేడుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..