Andhra Pradesh: మైలవరం వైసీపీలో వర్గ విభేదాలు సమసిపోయేనా? సీఎం జగన్ వద్దకు పంచాయితీ

ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం వైసీపీలో పంచాయతీ మరోసారి సీఎం జగన్‌ దగ్గరకు వెళ్లబోతోంది. ఇవాళ (ఫిబ్రవరి 09) సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్‌ను కలవనున్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌.

Andhra Pradesh: మైలవరం వైసీపీలో వర్గ విభేదాలు సమసిపోయేనా? సీఎం జగన్ వద్దకు పంచాయితీ
Ap Politics
Follow us

|

Updated on: Feb 09, 2023 | 1:53 PM

ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం వైసీపీలో పంచాయతీ మరోసారి సీఎం జగన్‌ దగ్గరకు వెళ్లబోతోంది. ఇవాళ (ఫిబ్రవరి 09) సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్‌ను కలవనున్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌. ఇటీవల మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపీకి, మంత్రి జోగి రమేష్‌కి మధ్య గ్యాప్‌ మరింత పెరిగింది. రెండు వర్గాలుగా విడిపోయి వైసీపీ నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. గతంలోనే ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు వసంత కృష్ణప్రసాద్‌. ఆ తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదు. ఈ వివాదానికి ఆజ్యం పోసేలా రెండు రోజుల కిందట రీజనల్‌ కోఆర్డినేటర్‌ మర్రి రాజశేఖర్‌ దగ్గర ఇరు వర్గాలు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం సీఎం జగన్‌ను కలబోతున్నారు వసంత కృష్ణప్రసాద్‌. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. కాగా గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ , మంత్రి జోగి రమేష్‌ మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. ఇటీవల వైసీపీ ఇన్‌చార్జ్‌ మర్రి రాజశేఖర్ దగ్గరకు కూడా మైలవరం పంచాయితీ చేరింది. అయితే మర్రి రాజశేఖర్ ఎదుటే ఇరు వర్గాల నేతలు బాహాబాహీకి దిగారు. కాగా ఈ వ్యవహారంపై బుధవారం (ఫిబ్రవరి 08) జరిగిన కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం జగన్‌ మంత్రి జోగి రమేశ్‌తో మాట్లాడారు. మైలవరంలో జరుగుతున్న వివాదాలపై సీఎం చర్చించినట్లు సమాచారం. ఇప్పుడిదే వ్యవహారంపై ఇవాళ సాయంత్రం సీఎం జగన్‌తో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ సమావేశం కానున్నారు.

కాగా గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్‌. మొన్నామధ్య.. . గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టైన ఉయ్యూరు శ్రీనివాస్‌కి మద్దతుగా కామెంట్స్ చేశారు. అంతేకాదు 10 , 15 మంది చీడ, పీడల వల్లే పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉండాలంటే చుట్టూ పది మంది పోరంబోకుల్ని ఉంచుకోవాలని తీవ్ర కామెంట్స్ చేశారు. ప్రతిపక్షంలో కాదు, స్వపక్షంలో ఉంటూ.. వెన్నుపోటు పొడిచేవారిని సహించేదిలేదని తేల్చి చెప్పారు.ఇక వీరసింహారెడ్డి రిలీజ్‌ సందర్భంగా హీరో బాల‌కృష్ణ ఫోటోలతో పాటు అన్న ఎన్టీఆర్ ఫోటో కూడా ప్రింట్ చేయించి మరో ఆసక్తికర చర్చకు దారి తీశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో