AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: అయోధ్య రామయ్యకు ధర్మవరం నేతన్నల అపూర్వ కానుక.. రామాయణ ఘట్టాలు ప్రతిబింబించేలా

అయోధ్యలో రూపుదిద్దుకుంటున్న రామ మందిరానికి అద్భుత హంగులు చేకూర్చేందుకు దేశంలో ప్రతీ ఒక్కరూ తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టువస్త్రాలకు ఖ్యాతిగాంచిన ఆంధ్రప్రదేశ్‌ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కళాకారులు శ్రీరాముడి కోసం అపురూప పట్టు వస్త్రాన్ని తయారు చేశారు. ఐదుగురు...

Ayodhya: అయోధ్య రామయ్యకు ధర్మవరం నేతన్నల అపూర్వ కానుక.. రామాయణ ఘట్టాలు ప్రతిబింబించేలా
Dharmavaram Weavers
Narender Vaitla
|

Updated on: Apr 20, 2023 | 3:20 PM

Share

అయోధ్యలో రూపుదిద్దుకుంటున్న రామ మందిరానికి అద్భుత హంగులు చేకూర్చేందుకు దేశంలో ప్రతీ ఒక్కరూ తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టువస్త్రాలకు ఖ్యాతిగాంచిన ఆంధ్రప్రదేశ్‌ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కళాకారులు శ్రీరాముడి కోసం అపురూప పట్టు వస్త్రాన్ని తయారు చేశారు. ఐదుగురు చేనేత కళకారులు దాదాపు నాలుగు నెలలపాటు శ్రమించి ఒక అపూర్వ వస్త్రాన్ని తయారు చేశారు. మగ్గంపై సహజ రంగులతో తయారు చేసిన ఈ వస్త్రాన్ని ఎవరైనా సరే చూస్తూ ఉండిపోవాల్సిందే. దాదాపు 160 అడుగులు అంటే సుమారు 49 మీటర్ల ఈ వస్త్రం ఆరు చీరల పొడవు ఉంటుంది.

ఈ వస్త్రం అంచులను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అంచుకు రెండు వైపులా రామాయణంలోని అపూర్వ ఘట్టాలను నేశారు చేనేత కళాకారులు. దశరథ మహారాజును శ్రవణ కుమారుడు శపించడం మొదలు లంక నుంచి సీతారాములు అయోధ్యకు చేరిన పట్టాభిషేకం వరకు రామాయణంలో 400 కీలక ఘట్టాలను ఈ వస్త్రంపై ఎంతో అపురూపంగా నేశారు. కళ్లకు కట్టినట్టుగా కనిపించే ఈ అపురూప దృశ్యాలను అలా కళ్లప్పగించి చూడాల్సిందే. అంతే కాదు ఈ వస్త్రం మధ్య భాగంలో 13 భాషల్లో జై శ్రీరామ్‌ అని రామకోటిని నేసారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, ఉర్దూ, గుజరాతీ, ఒడియాతో పాటు సింహళ భాషలో నేసిన జైశ్రీరామ్‌ అక్షరాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దీని కోసం వీరు దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దీనిని అయోధ్య రాముడికి బహుకరించేందుకు ఈ చేనేత కళాకారాలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Ayodhya Ram Mandir

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే అంతకు ముందే.. ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఈ వస్త్రాన్ని చూపాలని నేతన్నలు భావిస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా ఈ వస్త్రాన్ని అయోధ్య రాముడికి అందించాలన్నది ఈ కళాకారుల కోరిక. అయోధ్యలోని రామమందిరం వచ్చే సంక్రాంతి నుంచి భక్తుల దర్శనార్థం ప్రారంభం కానుంది. ఈ లోపే ఈ అపురూప వస్త్రాన్ని ఆ సీతారాముడి సన్నిధికి చేర్చాలని ధర్మవరం చేనేత కళాకారుల భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
బాత్రూంలో ఈ చిన్న వస్తువును పెట్టండి.. సంపద పెరుగుతుంది
బాత్రూంలో ఈ చిన్న వస్తువును పెట్టండి.. సంపద పెరుగుతుంది
అకస్మాత్తుగా ముఖాముఖి ఎదురుపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ..!
అకస్మాత్తుగా ముఖాముఖి ఎదురుపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ..!
టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
ఇంటి గుమ్మం వద్ద ఆవు నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా?
ఇంటి గుమ్మం వద్ద ఆవు నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా?
సేఫ్టీ పిన్ వెనుక ఈ రంధ్రం కనిపెట్టి.. బిలియన్ డాలర్ల సామ్రాజ్యం!
సేఫ్టీ పిన్ వెనుక ఈ రంధ్రం కనిపెట్టి.. బిలియన్ డాలర్ల సామ్రాజ్యం!
రానున్న అమావాస్యతో ఈ రాశుల వారి జీవితాల్లో వెలుగులు నిండటం ఖాయం
రానున్న అమావాస్యతో ఈ రాశుల వారి జీవితాల్లో వెలుగులు నిండటం ఖాయం
Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా..
Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా..