AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సీఎం జగన్ ఫేస్ మాస్క్‌తో మంత్రి అప్పల రాజు.. ఇంతకీ విషయం ఏంటంటే..?

ఏపీ తీర ప్రాంతంలో ఒక్క హార్బర్‌కు గాని, పోర్టుకు గాని చంద్రబాబు హయాంలో శంకుస్థాపన చేశారా? అని ప్రశ్నించారు మంత్రి. టీడీపీ నేతలు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు మంత్రి సిదిరి. పలాసలో త్వరలో ప్రారంభించనున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ముందు సీఎం జగన్ ఫేస్ మాస్క్‌తో సెల్ఫీ ఛాలెంజ్ చేశారు మంత్రి అప్పలరాజు. 

Andhra Pradesh: సీఎం జగన్ ఫేస్ మాస్క్‌తో మంత్రి అప్పల రాజు.. ఇంతకీ విషయం ఏంటంటే..?
Sidiri Appalaraju
Sanjay Kasula
|

Updated on: Apr 20, 2023 | 3:48 PM

Share

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు మంత్రి సీదిరి అప్పలరాజు బహిరంగ సవాల్‌ విసిరారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. చంద్రబాబు 14 ఏళ్ల కాలంలో ఒక్క పోర్ట్ , ఒక్క హార్బర్‌కు శంకుస్థాపన చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. అచ్చెన్నాయుడుకు పోయేకాలం వచ్చిందని మండిపడ్డ ఆయన.. అందుకే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు.. ఈసారి ఇక్కడి నుంచి వైఆర్‌సీపీ నుంచి దువ్వాడ శ్రీను గెలిచి తీరుతారని అన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చిద్దామాని చాలెంజ్‌ చేసిన మంత్రి అప్పలరాజు.. రూపాయి ఖర్చుతో సహా చెప్పగలను.. దమ్ముంటే అచ్చెన్నాయుడు చర్చకు రావాలని సవాల్‌ చేశారు. కళ్లు కనిపించడంలేదా..? మేం చేస్తున్న ప్రోజెక్టులు మీ ముందు లేవా? శ్రీకాకుళం జిల్లాకు ఇది చేశామనా అచ్చెన్నాయుడు చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు.

సీఎం జగన్‌ని విమర్శించే ముందు అచ్చెన్నాయుడు ఆలోచించి మాట్లాడాలంటూ హితవు పలికారు. 989 కిలోమీటర్లు తీరప్రాంతం ఉన్న రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి ఏం చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబు దూర దృష్టి ఏంటి..? విజనరీ ఏంటి .. ? అంటూ ఎద్దేవ చేశారు. అసలు తీర ప్రాంతానికి చంద్రబాబు చేసింది గుండు సున్నా అని విమర్శించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం