AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: బ్యాట్‌తో చెలరేగిన సూర్యకుమార్.. రాజ్‌కోట్‌ టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ.. సిరీస్‌ కైవసం

IND vs SL: భారత బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్ యాదవ్‌ బ్యాట్‌తో అర్షదీప్‌ బాల్‌తో చెలరేగడం రాజ్‌కోట్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్‌ 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం..

IND vs SL: బ్యాట్‌తో చెలరేగిన సూర్యకుమార్.. రాజ్‌కోట్‌ టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ.. సిరీస్‌ కైవసం
India Cricket Team
Amarnadh Daneti
|

Updated on: Jan 08, 2023 | 4:36 AM

Share

భారత బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్ యాదవ్‌ బ్యాట్‌తో అర్షదీప్‌ బాల్‌తో చెలరేగడం రాజ్‌కోట్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్‌ 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకుంది. మొదటి టీ20లో విజయం సాధించిన భారత్‌, రెండో మ్యాచ్ ఓడిపోయింది. దీంతో మూడో టీ20 మ్యాచ్‌ ఆసక్తిని రెకెత్తించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 51 బంతుల్లో 112 పరుగులు చేసి సెంచరీతో చెలరేగడంతో భారత్‌ సునాయసంగా విజయం సాధించింది. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి 137 పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. లంక బ్యాటర్లలో శానక 23 పరుగులు చేయగా, ధనంజయ 22, అసలంక 19 పరుగులు మాత్రమే చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3, హార్దిక్ పాండ్యా 2, ఉమ్రాన్‌ మాలిక్ 2, చాహల్ 2, అక్షర్‌ పటేల్ 1 వికెట్ తీసుకున్నారు.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్య కుమార్‌ యాదవ్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు. శుభ్‌మన్‌ గిల్ 46 పరుగులు, రాహుల్‌ త్రిపాఠి 35 పరుగులు, అక్షర్‌ పటేల్ 21 పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో మదుశంక రెండు.. రజితా, కరుణరత్నె, హసరంగ తలో వికెట్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం  చూడండి..