మానవ అవసరాలతో ప్రమాదం అంచున చైనా.. మునిగిపోతున్న బీజింగ్, షాంఘై సహా అనేక నగరాలు

ఓ వైపు భూమి కుంగిపోతుంది.. మరోవైపు మంచు కరిగిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా చైనా కూడా మునిగిపోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక నగరం తర్వాత మరొకటి కుంగిపోనున్నాయి. లక్షలాది మంది ప్రజలు  నిరాశ్రయులుకానున్నారు. ప్రస్తుతం భారతదేశ పొరుగు దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది.  భూమిని భవన నిర్మాణాల కోసం, గనుల తవ్వకాలు అంటూ తవ్వేస్తున్నారు. అంతేకాదు నగరాల్లో లోతుగా తవ్వి మరీ నీటి వెలికితీత, ఎత్తైన భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించడం వల్ల మట్టిని తవ్వడంతో భూమిబలం తగ్గుతోంది

మానవ అవసరాలతో ప్రమాదం అంచున చైనా.. మునిగిపోతున్న బీజింగ్, షాంఘై సహా అనేక నగరాలు
China Major Cities Skinking
Follow us

|

Updated on: Apr 20, 2024 | 5:54 PM

మనుషుల అలవాట్లు, పర్యావరణానికి చేస్తున్న హానితో ప్రపంచంలో అనేక ప్రాంతాలకు ముప్పు వాటిల్లనున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వర్షాలు, వరదలు కాలంతో సంబంధం లేకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఓ వైపు భూమి కుంగిపోతుంది.. మరోవైపు మంచు కరిగిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా చైనా కూడా మునిగిపోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక నగరం తర్వాత మరొకటి కుంగిపోనున్నాయి. లక్షలాది మంది ప్రజలు  నిరాశ్రయులుకానున్నారు. ప్రస్తుతం భారతదేశ పొరుగు దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది.  భూమిని భవన నిర్మాణాల కోసం, గనుల తవ్వకాలు అంటూ తవ్వేస్తున్నారు. అంతేకాదు నగరాల్లో లోతుగా తవ్వి మరీ నీటి వెలికితీత , పట్టణ భవనాలు , మౌలిక సదుపాయాలతో పెరుగుతున్న బరువు కారణంగా, ఎత్తైన భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించడం వల్ల మట్టిని తవ్వడంతో భూమిబలం తగ్గుతోంది. దీంతో చైనాలోని చాలా నగరాలు ప్రమాదబారిన పడుతున్నాయి.

బీజింగ్, టియాంజిన్ వంటి పెద్ద , జనసాంద్రత కలిగిన నగరాలు ప్రమాదం అంచున ఉన్నాయని.. ఇప్పటికే కుంగిపోతున్నాయని సైన్స్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించిన పరిశోధనా జర్నల్ లో పేర్కొంది. చైనాలోని 45 శాతం శివారు ప్రాంతాలు వేగంగా కుంగిపోయి..  మునిగిపోతున్నాయి. ఇక్కడ భూమి క్షీణత సంవత్సరానికి 3 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. ఏడాదికి 10 మిల్లీమీటర్ల చొప్పున 16 శాతం భూమి కుంగిపోతుంది.

2015  నుంచి 2022 మధ్య, 20 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న చైనా నగరాలు వేగంగా  నేలకూలుతున్నాయని అధ్యయనం కనుగొంది. గత దశాబ్ద కాలంలో షాంఘై దాదాపు 3 మీటర్ల మేర కుంగిపోయింది. బీజింగ్ సబ్‌వేలు, హైవేలు సంవత్సరానికి 45 మిల్లీమీటర్ల వద్ద స్థిరపడతాయి. ఎత్తైన భవనాలు నిర్మిస్తుండడంతో భూమి కిందకు కుంగిపోతుంది.

ఇవి కూడా చదవండి

పొరుగు దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండడంతో మన దేశం నగరాల పరిస్థితి ఎలా ఉంది అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతం భారతదేశంలో నీటి సంక్షోభం స్పష్టంగా కనిపిస్తోంది. బెంగళూరు ఇప్పటికే పొడిగా మారింది. భూమి కింద నీరు అడుగంటిపోయింది. భారత్‌లో కూడా చైనా పరిస్థితిలా కొనసాగితే.. కోల్‌కతా, ముంబై వంటి పెద్ద మెట్రో నగరాలు కుంగిపోవచ్చని హెచ్చరిస్తున్నారు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?