AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airport Heist: రూ.260కోట్ల కోసం ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చిన దొంగల ముఠా.. కాల్పుల్లో ఇద్దరు మృతి.. చివరికి ఏమైందంటే..?

సినీ ఫక్కీలో ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చిన దొంగల ముఠా డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమవడంతో..

Airport Heist: రూ.260కోట్ల కోసం ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చిన దొంగల ముఠా.. కాల్పుల్లో ఇద్దరు మృతి.. చివరికి ఏమైందంటే..?
Aircraft Heist
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 09, 2023 | 6:52 PM

Share

విమానంలో తరలిస్తున్న భారీ మొత్తాన్ని దోచుకునేందుకు ఓ దొంగల ముఠా పడరాని పాట్లు చేసింది. సినీ ఫక్కీలో ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చి డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమవడంతో దుండగులను అడ్డుకోగలిగారు. వివరాల్లోకి వెళ్తే.. చిలీ రాజధాని శాంటియాగోలో ఈ ఘటన జరిగింది. ఫ్లోరిడాలోని మియామీ నుంచి 32.5 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.262 కోట్లు) నగదును ప్రత్యేక విమానంలో బుధవారం చిలీకి తీసుకొచ్చారు. చిలీలోని పలు బ్యాంకులకు తరలించాల్సిన ఆ నగదుకు సంబంధించిన వివరాలు తిలిసిన ఓ దొంగల ముఠా.. శాంటియాగోలోని ఆర్తురో మెరినో బెనిటెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానం దిగగానే అందులోని డబ్బును ఓ సాయుధ ట్రక్కులోకి తరలిస్తుండగా దాడి చేసింది. వాహనాలతో సహా విమానాశ్రయ గేటును బద్దలుకొట్టి ఆ ముఠా రన్‌వేపైకి చొచ్చుకొచ్చింది.

ఆ క్రమంలో కొందరు దొంగలు అయితే ఏకంగా భద్రతా సిబ్బందిపైనే దాడి చేసి వారి ఆయుధాలను లాక్కున్నారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు పోలీసులు వెంటనే వారిపైకి కాల్పులు జరిపారు. దీంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల ఘటనలో విమానాశ్రయంలోని ఓ సెక్యూరిటీ ఉద్యోగి మృతిచెందగా.. నిందితుల్లో ఒకడు హతమయ్యాడు. ఇక మిగతవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాగా, ఘటన తర్వాత డబ్బు సురక్షితంగానే ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు శాంటియాగో ఎయిర్‌పోర్టులో ఇలాంటి ఘరానా దోపిడీలు కొత్తేమీ కాదు. 2020లో అయితే ఓ దొంగల ముఠా ఎయిర్‌పోర్టులోని ఓ గోదాంలో ఉంచిన 15 మిలియన్‌ డాలర్ల విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లింది. అంతకుముందు ఆరేళ్ల క్రితం కూడా 10 మిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులు కూడా చోరీకి గురయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?