Airport Heist: రూ.260కోట్ల కోసం ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చిన దొంగల ముఠా.. కాల్పుల్లో ఇద్దరు మృతి.. చివరికి ఏమైందంటే..?

సినీ ఫక్కీలో ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చిన దొంగల ముఠా డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమవడంతో..

Airport Heist: రూ.260కోట్ల కోసం ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చిన దొంగల ముఠా.. కాల్పుల్లో ఇద్దరు మృతి.. చివరికి ఏమైందంటే..?
Aircraft Heist
Follow us

|

Updated on: Mar 09, 2023 | 6:52 PM

విమానంలో తరలిస్తున్న భారీ మొత్తాన్ని దోచుకునేందుకు ఓ దొంగల ముఠా పడరాని పాట్లు చేసింది. సినీ ఫక్కీలో ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చి డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమవడంతో దుండగులను అడ్డుకోగలిగారు. వివరాల్లోకి వెళ్తే.. చిలీ రాజధాని శాంటియాగోలో ఈ ఘటన జరిగింది. ఫ్లోరిడాలోని మియామీ నుంచి 32.5 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.262 కోట్లు) నగదును ప్రత్యేక విమానంలో బుధవారం చిలీకి తీసుకొచ్చారు. చిలీలోని పలు బ్యాంకులకు తరలించాల్సిన ఆ నగదుకు సంబంధించిన వివరాలు తిలిసిన ఓ దొంగల ముఠా.. శాంటియాగోలోని ఆర్తురో మెరినో బెనిటెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానం దిగగానే అందులోని డబ్బును ఓ సాయుధ ట్రక్కులోకి తరలిస్తుండగా దాడి చేసింది. వాహనాలతో సహా విమానాశ్రయ గేటును బద్దలుకొట్టి ఆ ముఠా రన్‌వేపైకి చొచ్చుకొచ్చింది.

ఆ క్రమంలో కొందరు దొంగలు అయితే ఏకంగా భద్రతా సిబ్బందిపైనే దాడి చేసి వారి ఆయుధాలను లాక్కున్నారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు పోలీసులు వెంటనే వారిపైకి కాల్పులు జరిపారు. దీంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల ఘటనలో విమానాశ్రయంలోని ఓ సెక్యూరిటీ ఉద్యోగి మృతిచెందగా.. నిందితుల్లో ఒకడు హతమయ్యాడు. ఇక మిగతవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాగా, ఘటన తర్వాత డబ్బు సురక్షితంగానే ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు శాంటియాగో ఎయిర్‌పోర్టులో ఇలాంటి ఘరానా దోపిడీలు కొత్తేమీ కాదు. 2020లో అయితే ఓ దొంగల ముఠా ఎయిర్‌పోర్టులోని ఓ గోదాంలో ఉంచిన 15 మిలియన్‌ డాలర్ల విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లింది. అంతకుముందు ఆరేళ్ల క్రితం కూడా 10 మిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులు కూడా చోరీకి గురయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles