IPL Runouts : గౌతమ్ గంభీర్ నుంచి ధావన్ దాకా.. ఒక్క పరుగు కోసం ఆశపడి వికెట్లు పారేసుకున్న దిగ్గజాలు వీళ్లే
IPL Runouts : మరో పది రోజుల్లో ఐపీఎల్ 2026 సందడి మొదలవ్వనుంది. మార్చి 28న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తొలి మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి రంగం సిద్ధమవుతున్న వేళ, ఈ మెగా టోర్నీ చరిత్రలో నమోదైన ఆసక్తికరమైన గణాంకాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

IPL Runouts : మరో పది రోజుల్లో ఐపీఎల్ 2026 సందడి మొదలవ్వనుంది. మార్చి 28న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తొలి మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి రంగం సిద్ధమవుతున్న వేళ, ఈ మెగా టోర్నీ చరిత్రలో నమోదైన ఆసక్తికరమైన గణాంకాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటర్లకు అత్యంత భారంగా అనిపించే రన్ అవుట్ గణాంకాలను గమనిస్తే పలువురు దిగ్గజ ఆటగాళ్ల పేర్లు ఆ జాబితాలో ఉండటం విశేషం. క్రీజులో ఒక్క పరుగు కోసం ఆశపడి లేదా తోటి బ్యాటర్తో సమన్వయ లోపం కారణంగా విలువైన వికెట్లను సమర్పించుకున్న వారిలో టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అగ్రస్థానంలో నిలిచారు. గంభీర్ తన ఐపీఎల్ ప్రస్థానంలో ఆడిన 154 మ్యాచ్ల్లో ఏకంగా 16 సార్లు రన్ అవుట్ అయ్యి ఈ అన్-లక్కీ రికార్డును మూటగట్టుకున్నారు.
గంభీర్తో పాటు టీమిండియా మాజీ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఇదే తరహాలో 16 సార్లు రన్ అవుట్ అయ్యి మొదటి స్థానాన్ని పంచుకున్నారు. 2008 నుంచి 2024 వరకు సాగిన తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్లో ధావన్ 222 మ్యాచ్లు ఆడి అనేకసార్లు పరుగుల కోసం ప్రయత్నిస్తూ వికెట్ పారేసుకున్నారు. వీరిద్దరూ క్రీజులో పరుగుల వేటలో ఎంత వేగంగా దూసుకెళ్తారో, కొన్నిసార్లు అంతే వేగంగా దురదృష్టవశాత్తూ అవుట్ అవ్వడం అభిమానులను సైతం విస్మయానికి గురిచేస్తుంది. మైదానంలో అత్యంత చురుగ్గా ఉండే ఈ ఆటగాళ్లే రన్ అవుట్లలో టాప్ ప్లేస్లో ఉండటం గమనార్హం.
ఈ జాబితాలో తర్వాతి స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ నిలిచారు. మొత్తం 257 మ్యాచ్లు ఆడిన కార్తీక్, తన కెరీర్లో 15 సార్లు రన్ అవుట్ అయ్యారు. సాధారణంగా కార్తీక్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్కు వస్తుంటారు. ఆ సమయంలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాలనే ఒత్తిడిలో వేగంగా సింగిల్స్, డబుల్స్ తీయబోయి రన్ అవుట్గా వెనుదిరిగేవారు. ఫినిషర్గా జట్టుకు భారీ స్కోరు అందించే క్రమంలో ఆయన ఈ చేదు అనుభవాన్ని పదిహేను సార్లు చవిచూశారు.
కేవలం కార్తీక్ మాత్రమే కాకుండా టీమిండియా మాజీ ఆటగాళ్లు సురేష్ రైనా, అంబటి రాయుడు కూడా ఈ రన్ అవుట్ల గండం నుంచి తప్పించుకోలేకపోయారు. రైనా 205 మ్యాచ్ల్లో, రాయుడు 204 మ్యాచ్ల్లో చెరో 15 సార్లు రన్ అవుట్ అయ్యి కార్తీక్తో సమానంగా రెండో స్థానంలో నిలిచారు. ఐపీఎల్ 2026లో మరికొన్ని కొత్త నిబంధనలు వస్తున్న తరుణంలో, ఈ రన్ అవుట్ల సంఖ్య తగ్గుతుందో లేదో చూడాలి. మార్చి 28న బెంగళూరు, హైదరాబాద్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్లో బ్యాటర్లు ఇలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
