AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2025: వినాయకుడికి ఇష్టమైనవి.. మోదకాలతో పాటు ఈ 5 నైవేద్యాల ప్రాముఖ్యత ఏంటో తెలుసా..?

ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం రావడం వల్ల చాలా ప్రత్యేకమైంది. బుధ గ్రహం జ్ఞానం, విద్య, కమ్యూనికేషన్‌కు సూచిక. వినాయకుడు కూడా వీటిని ప్రసాదిస్తాడు. ఈ రోజు చేసే పూజలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఐదు నైవేద్యాలు సమర్పిస్తే సంపద, శాంతి, విజయం లభిస్తాయి.

Ganesh Chaturthi 2025: వినాయకుడికి ఇష్టమైనవి.. మోదకాలతో పాటు ఈ 5 నైవేద్యాల ప్రాముఖ్యత ఏంటో తెలుసా..?
Ganesha Prasadhams
Prashanthi V
|

Updated on: Aug 26, 2025 | 2:55 PM

Share

ఈసారి వినాయక చవితి బుధవారం రోజున రావడం వల్ల చాలా ప్రత్యేకమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బుధ గ్రహం తెలివి, జ్ఞానం, కమ్యూనికేషన్‌కు సూచిక. వినాయకుడు కూడా వీటినే ప్రసాదిస్తాడు కాబట్టి.. ఈ రోజు చేసే పూజలు, ప్రార్థనలు రెట్టింపు శక్తితో ఫలితాలనిస్తాయి. విద్య, ఉద్యోగం, కొత్త పనులు ప్రారంభించే వారికి ఇది ఒక మంచి అవకాశం. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలతో పాటు.. ఈ ఐదు రకాల నైవేద్యాలు సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది.

పసుపుతో కలిపిన బియ్యం

బియ్యాన్ని మన సంస్కృతిలో స్థిరత్వానికి, సమృద్ధికి చిహ్నంగా భావిస్తారు. ఒక కిలో 250 గ్రాముల బియ్యాన్ని పసుపుతో కలిపి దేవుడికి సమర్పించడం చాలా శుభప్రదం. ఈ పరిమాణం (ఒకన్నర కిలో) పూర్తిస్థాయిలో ఉన్న సంపదను సూచిస్తుంది. పసుపు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, శ్రేయస్సును తెస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనం నిలుస్తుంది, పనులు సజావుగా పూర్తవుతాయి.

కొబ్బరికాయ

కొబ్బరికాయను దేవతల ఫలం అని పిలుస్తారు. దాని పైనున్న గట్టి టెంక మన అహంకారాన్ని, లోపలి తెల్లని గింజ స్వచ్ఛతను సూచిస్తాయి. కొబ్బరికాయను సమర్పించడం అంటే మన అహంకారాన్ని విడిచిపెట్టి.. మంచి ఆరోగ్యం, శాంతి, స్వచ్ఛతను కోరుకోవడం. కొత్తగా ఏ పని ప్రారంభించినా ముందు కొబ్బరికాయ కొట్టడం ఆటంకాలను తొలగిస్తుంది.

చెరకు గడ

చెరకు తీపి, ఆనందం, ధైర్యానికి సంకేతం. వినాయకుడికి చెరకు సమర్పించడం వల్ల కుటుంబంలో ప్రేమ, ఐక్యత పెరుగుతాయి. ఇది సంపదను కూడా తెస్తుంది. చెరకు గడ పొడవుగా ఉంటుంది కాబట్టి.. అది ఎదుగుదల, దీర్ఘాయువును సూచిస్తుంది. కష్టాలను ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఆనందం, ఐశ్వర్యం కావాలనుకునే వారికి ఈ నైవేద్యం చాలా శుభప్రదం.

తామర పువ్వు

తామర పువ్వు పవిత్రతకు, ఆధ్యాత్మిక భావాలకు చిహ్నం. అది బురదలో పుట్టినా బురద అంటకుండా స్వచ్ఛంగా ఉంటుంది. ఇది కష్టాలను అధిగమించి విజయం సాధించడాన్ని సూచిస్తుంది. వినాయకుడికి తామర పువ్వు సమర్పించడం వల్ల మనసులో స్పష్టత, జ్ఞానం పెరుగుతాయి. విద్య, కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఇది చాలా మంచిది.

అరటి ఆకు

హిందూ సంప్రదాయంలో అరటి ఆకు చాలా పవిత్రమైనది. దానిపై దేవుడికి నైవేద్యం పెట్టడం శుభప్రదం, శుద్ధికి సంకేతం. ఇది కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతిని ఇస్తుంది. వినాయక చవితి రోజు అరటి ఆకుపై నైవేద్యం సమర్పించడం వల్ల పూజకు మరింత పవిత్రత లభిస్తుంది.

ఈసారి వినాయక చవితి బుధవారం రోజున వస్తుంది కాబట్టి.. ఈ నైవేద్యాలను సమర్పించడం వల్ల ఆశించిన ఫలితాలు రెట్టింపు అవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.