Stress Study: పురుషులు, మహిళల్లో ఎక్కువగా ఒత్తిడికి గురైయ్యేది ఎవరంటే..?

భారత దేశంలో మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే వారి గురించి.. యువర్ దోస్ట్ అనే సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో షాక్ గురి చేసే నిజాలు వెల్లడయ్యాయి. సాధారణంగా మహిళల కంటే పురుషులే ఎక్కువగా కష్ట పడతారు. వారే ఎక్కువగా మానసికంగా ఒత్తిడికి గురవుతారని అందరూ అనుకుంటారు. కానీ ఇది తప్పు. పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని..

Stress Study: పురుషులు, మహిళల్లో ఎక్కువగా ఒత్తిడికి గురైయ్యేది ఎవరంటే..?
Viral News
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 22, 2024 | 3:32 PM

భారత దేశంలో మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే వారి గురించి.. యువర్ దోస్ట్ అనే సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో షాక్ గురి చేసే నిజాలు వెల్లడయ్యాయి. సాధారణంగా మహిళల కంటే పురుషులే ఎక్కువగా కష్ట పడతారు. వారే ఎక్కువగా మానసికంగా ఒత్తిడికి గురవుతారని అందరూ అనుకుంటారు. కానీ ఇది తప్పు. పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని యువర్ దోస్ట్ అనే సంస్థ తేల్చింది. దేశ వ్యాప్తంగా ఉద్యోగం చేసే 5 వేల మందిపై ఈ సర్వే నిర్వహించారు.

పురుషులతో పోల్చితే ఆఫీసుల్లో పని చేసే మహిళలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారని సర్వే ప్రతి నిధులు వెల్లడించారు. సర్వే చేసిన వారిలో 72.2 శాతం మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారని.. కానీ మగవారిలో 53 శాతం మంది ఉన్నారని వెల్లడించారు. మహిళల్లో ఒత్తిడికి కారణాలు పేర్కొంటూ.. సరైన గుర్తింపు లేకపోవడం, తోటి ఉద్యోగులతో ఎక్కువగా కలవలేకపోవడం, ప్రతీ దానికి భయ పడటం, అనుమానంగా ఉండటం వంటి విషయాలు బయటకు వచ్చాయి. ఇంట్లో బాధ్యతలు, పనులు, పిల్లల కారణంగా కూడా స్ట్రెస్‌కి గురవుతున్నారు.

పురుషులతో పోల్చితే వారి కంటే 30 శాతం అధికంగా మంది మహిళలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. వీటి వలన మహిళల్లో కూడా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువైనట్లు తేలింది. డయాబెటీస్, బీపీ, అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, సరైన సమయం ఉండక పోవడం, గుండె జబ్బులు వంటి సమస్యలు వస్తున్నాయి.

అదే విధంగా ఉద్యోగుల ఎమోషనల్ వెల్ నెస్ స్టేట్ నివేదిక ప్రకారం.. 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న 64.42 శాతం మహిళా ఉద్యోగులు అత్యంత ఒత్తిడికి గురవుతున్నారు. 31.40 సంవత్సరాల మధ్య ఉన్న కార్మికులు 59.81 శాతం, 41 – 50 ఏళ్ల మధ్యలో వారు 53 శాతం టెన్షన్‌కి గురవుతున్నారని నివేదికలో వెల్లడైంది. అంతే కాకుండా వర్క్ ప్లేస్‌లో కూడా మార్పులు కూడా మహిళల ఆరోగ్యం, మానసిక ఒత్తిడిపై ప్రభావం చూపిస్తుంది. ఇలా పురుషుల కంటే ఆడవారే ఎక్కువగా స్ట్రెస్‌కి గురవుతున్నట్లు తేలింది.

యాపిల్‌కు పోటీగా జియో ఎయిర్ ట్యాగ్ లాంచ్.. ధర తెలిస్తే షాక్..!
యాపిల్‌కు పోటీగా జియో ఎయిర్ ట్యాగ్ లాంచ్.. ధర తెలిస్తే షాక్..!
ప్రతి సంవత్సరం 78 లక్షల మందికి ఉద్యోగాలు: ఆర్థిక సర్వేలో వెల్లడి
ప్రతి సంవత్సరం 78 లక్షల మందికి ఉద్యోగాలు: ఆర్థిక సర్వేలో వెల్లడి
ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
నెలకు రూ. 10వేలతో రూ. 18లక్షలు చేతికి..
నెలకు రూ. 10వేలతో రూ. 18లక్షలు చేతికి..
మెట్రోలో రెచ్చిపోయిన యువతి.. ఆ పని చేసి పోలీసులకు సారి చెప్పింది!
మెట్రోలో రెచ్చిపోయిన యువతి.. ఆ పని చేసి పోలీసులకు సారి చెప్పింది!
అది ఎన్టీఆర్ క్రేజ్ అంటే..! తారక్ ఫ్యాన్స్‌ను ఖుష్ చేసిన ధనుష్..
అది ఎన్టీఆర్ క్రేజ్ అంటే..! తారక్ ఫ్యాన్స్‌ను ఖుష్ చేసిన ధనుష్..
ఈచెడుఅలవాట్లు తక్షణమే వదులుకోండి.. లేదంటేజీవితంలోఇబ్బందులు తప్పవు
ఈచెడుఅలవాట్లు తక్షణమే వదులుకోండి.. లేదంటేజీవితంలోఇబ్బందులు తప్పవు
రియల్‌గా హిప్నటైజ్ చేయడం చూశారా.. ఈ వీడియో చూడండి..
రియల్‌గా హిప్నటైజ్ చేయడం చూశారా.. ఈ వీడియో చూడండి..
ఆర్థిక మంత్రికి బదులుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానులు వీరే
ఆర్థిక మంత్రికి బదులుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానులు వీరే
తొక్కే కదా అని తేలిగ్గా తీసుకోకండి.. ఖరీదైన ఈ పండ్ల తొక్కలతో ..
తొక్కే కదా అని తేలిగ్గా తీసుకోకండి.. ఖరీదైన ఈ పండ్ల తొక్కలతో ..