Road Accident: యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డీఎస్పీలు మృతి
Road Accident: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం ఆగడం లేదు. తాజాగా తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం దగ్గర జాతీయ రహదారిపై జరిగిన

రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అతివేగం, ఓవర్టెక్, రాట్లో వెళ్లడం, అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం ఆగడం లేదు. తాజాగా తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం దగ్గర జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు.
విజయవాడ వైపు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టడంతో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఏపీకి చెందిన చెందిన డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావు ప్రాణాలు కోల్పోయారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్, డ్రైవర్కు నర్సింగ్రావుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక డ్రైవర్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. స్కార్పియో వాహణం ముందు ఉన్న లారీని తప్పించబోయి డివైడర్ ఎక్కి రాంగ్ రూట్లోకి దూసుకెళ్లింది.
