Revanth Reddy: ‘ఈటెల లక్ష్యం అదే.. కానీ’ అంటూ.. బీజేపీ నేతపై కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతోనే ఈటల రాజేందర్ భాజపాలో..

Revanth Reddy: ‘ఈటెల లక్ష్యం అదే.. కానీ’ అంటూ.. బీజేపీ నేతపై కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే..
Revanth Reddy On Etela And Bjp
Follow us

|

Updated on: Jan 26, 2023 | 7:44 PM

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతోనే ఈటల రాజేందర్ భాజపాలో చేరారని.. ఆ పార్టీ, కేసీఆర్‌ ఒక్కటేనన్న విషయం ఆయన మాటల్లోనే స్పష్టమైందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. భాజపాలో కూడా కేసీఆర్‌ కోవర్టులు ఉన్నారని.. ఈటల పార్టీలో చేరిన తర్వాతనే ఆయనకు అర్థమైందన్నారు రేవంత్. ఇప్పుడు రాజేందర్ తన లక్ష్యసాధన కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గురువారం(జనవరి 26) మీడియాతో మాట్లాడిన రేవంత్‌ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

భాజపాకి ఓట్లు పడడానికి అదే కారణం..

సీఎం కేసీఆర్‌కు ఆది నుంచి అంబేడ్కర్ మీద గౌరవం లేదని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పుట్టిన రోజు కాకుండా, అంబేడ్కర్‌ పుట్టిన రోజు సచివాలయాన్ని ప్రారంభిస్తే ఆయనకు గౌరవం ఉండేదని అభిప్రాయపడ్డారు రేవంత్. ఈటెల రాజేందర్‌, వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. భాజపా సిద్ధాంతాలను విశ్వసించరని పేర్కొన్నారు. భాజపా ఐడియాలజీతో ఈ ముగ్గురికి సంబంధం లేదన్న రేవంత్‌.. వీరు కేవలం కేసీఆర్‌ను మాత్రమే వ్యతిరేకిస్తారన్నారు. భాజపాలో కూడా కోవర్టులు ఉన్నారని ఈటెల అన్నారంటే.. ఆయన ఏదో అసంతృప్తిగా ఉన్నట్లే కాదా..? అని రేవంత్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈటల రాజేందర్‌ ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక సతమతమవుతున్నారని, హుజూరాబాద్, మునుగోడులలో రెండు చోట్ల కూడా సందర్భానుసారమే భాజపాకి ఓట్లు పడ్డాయన్నారు.

మిగతా సందర్భాలలో ఆ ఓట్లు కూడా పడేవి కావని వ్యాఖ్యానించారు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారని, హైకమాండ్‌ ఆ బాధ్యతలు ఆయనకు అప్పగించిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత కఠినతరం చేయనున్నట్లు రేవంత్ వివరించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పుడు వయో పరిమితి 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తామని వెల్లడించారు. 21 ఏళ్లకే కలెక్టర్‌ అయ్యేందుకు అవకాశం కల్పించినప్పుడు.. ఎమ్మెల్యే అయితే తప్పేముందని రేవంత్‌ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

కేసీఆర్‌‌ క్షమాపణ చెప్పాలి..

సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రిపబ్లిక్‌ డేను ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌కే పరిమితం చేశారని మండిపడిన రేవంత్.. గణతంత్ర వేడుకను వివాదాలకు వేదిక చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌, సీఎం మధ్య విభేదాలుంటే మరో వేదికపై ప్రదర్శించాలి కానీ, గణతంత్ర వేడుకను వేదిక చేసుకోవడం సరికాదని హితవు పలికారు. సీఎం కేసీఆర్‌ తన వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ వెంటనే గవర్నర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్