AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కన్నీటిపర్యంతమైన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.. స్నేహితుడిని తలుచుకుంటూ భావోద్వేగం..

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. ఇవాళ ( శుక్రవారం ) తన పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలు..

Telangana: కన్నీటిపర్యంతమైన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.. స్నేహితుడిని తలుచుకుంటూ భావోద్వేగం..
Pocharam Srinivas Reddy
Ganesh Mudavath
|

Updated on: Feb 10, 2023 | 5:00 PM

Share

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. ఇవాళ ( శుక్రవారం ) తన పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలు నాటారు. ఈ సందర్భంగా, ప్రాణస్నేహితుడు సాలంబి నలిని గుర్తుచేసుకున్నారు. ఆయన గురించి చెబుతూ.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సాలంబి నలి హఠాన్మరణం తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందంటూ బోరున విలపించారు. మాట్లాడుతూ కన్నీటిని ఆపుకోలేకపోయారు.

మిత్రుడి మరణం బాధాకరమని, నియోజకవర్గంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు కార్యక్రమాలను రద్దు చేసినట్టు పోచారం వెల్లడించారు. అసెంబ్లీలోనూ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోరాదని నిర్ణయించుకున్నానని, కానీ ఇక్కడ ముందే ఏర్పాట్లు చేసి ఉండడంతో జరుపుకోవాల్సి వచ్చిందని వివరించారు.

ఇవి కూడా చదవండి