AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP New Districts: ఏపీ ప్రభుత్వం సడెన్ డెసిషన్.. రేపటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు..

ఏపీలో డిసెంబర్ 31 నుంచి రెండు కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయి. కొత్త ఏడాది తర్వాత ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ముందుగా భావించినప్పటికీ.. ముందే ఏర్పాటును అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే

Venkatrao Lella
|

Updated on: Dec 30, 2025 | 7:57 PM

Share
ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటుకు సోమవారం కేబినెట్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఒక జిల్లా కేంద్రంను మరోక ప్రాంతానికి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలు ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయనే దానిపై ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటుకు సోమవారం కేబినెట్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఒక జిల్లా కేంద్రంను మరోక ప్రాంతానికి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలు ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయనే దానిపై ప్రజలు ఎదురుచూస్తున్నారు.

1 / 5
ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాలు డిసెంబర్ 31 నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో బుధవారం నుంచి ఏపీలో మార్కాపురం జిల్లా,  పోలవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.

ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాలు డిసెంబర్ 31 నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో బుధవారం నుంచి ఏపీలో మార్కాపురం జిల్లా, పోలవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.

2 / 5
మార్కాపురం జిల్లాకు మార్కాపురం టౌన్ కేంద్రంగా ఉండనుండగా.. పోలవరం జిల్లాలకు రంపచోడవరం కేంద్రంగా ఉండనుంది. ఇక అన్నమయ్య జిల్లాకు ఇప్పటివరకు జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండగా.. దానిని మదనపల్లెకు మార్చుతూ కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం కూడా రేపటి నుంచి అమలు చేయనున్నారు.

మార్కాపురం జిల్లాకు మార్కాపురం టౌన్ కేంద్రంగా ఉండనుండగా.. పోలవరం జిల్లాలకు రంపచోడవరం కేంద్రంగా ఉండనుంది. ఇక అన్నమయ్య జిల్లాకు ఇప్పటివరకు జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండగా.. దానిని మదనపల్లెకు మార్చుతూ కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం కూడా రేపటి నుంచి అమలు చేయనున్నారు.

3 / 5
ఇప్పటివరకు ఏపీలో 26 జిల్లాలు ఉండగా.. కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటుతో ఆ సంఖ్య 28కి చేరుకుంది. ఇక రేపటి నుంచి కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. మండలాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులను మార్చనున్నారు. దీనికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇప్పటివరకు ఏపీలో 26 జిల్లాలు ఉండగా.. కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటుతో ఆ సంఖ్య 28కి చేరుకుంది. ఇక రేపటి నుంచి కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. మండలాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులను మార్చనున్నారు. దీనికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ జారీ చేసింది.

4 / 5
గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టగా.. అందులో పొరపాట్లు ఉన్నాయని టీడీపీ ప్రభుత్వం ఆరోపించింది. తాము అధికారంలోకి వచ్చాక మార్పులు చేస్తామని తెలిపింది. అందుకు అనుగుణంగా ఇప్పుడు కొత్త జిల్లాలతో పాటు కొన్ని జిల్లాల కేంద్రాల్లో మార్పులు చేసింది.

గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టగా.. అందులో పొరపాట్లు ఉన్నాయని టీడీపీ ప్రభుత్వం ఆరోపించింది. తాము అధికారంలోకి వచ్చాక మార్పులు చేస్తామని తెలిపింది. అందుకు అనుగుణంగా ఇప్పుడు కొత్త జిల్లాలతో పాటు కొన్ని జిల్లాల కేంద్రాల్లో మార్పులు చేసింది.

5 / 5
Follow Us