న్యూ ఇయర్ కిక్కే కిక్కు.. డిసెంబర్ 31న అప్పటి వరకు వైన్ షాపులు.. అక్కడ మాత్రం..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025లో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించాయి. కొత్త మద్యం పాలసీ ప్రభావంతో ఈ ఏడాది లిక్కర్ సేల్స్ ఊహించని స్థాయికి చేరుకున్నాయి. 2025 డిసెంబర్ 29 నాటికే రాష్ట్రంలో మొత్తం రూ.4,316 కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025లో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించాయి. కొత్త మద్యం పాలసీ ప్రభావంతో ఈ ఏడాది లిక్కర్ సేల్స్ ఊహించని స్థాయికి చేరుకున్నాయి. 2025 డిసెంబర్ 29 నాటికే రాష్ట్రంలో మొత్తం రూ.4,316 కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. గతేడాది డిసెంబర్ 31 వరకు నమోదైన అమ్మకాలు రూ.4,321 కోట్లు కాగా, ఈసారి ఇంకా రెండు రోజులు మిగిలే ఉండగానే దాదాపు అదే స్థాయికి చేరుకోవడం విశేషం. డిసెంబర్ 30, 31 తేదీల్లో మద్యం అమ్మకాలు మరింత జోరుగా సాగనున్నాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఈ రెండు రోజుల్లోనే రూ.600 కోట్లకు పైగా అదనపు సేల్స్ ఉండే అవకాశముందని చెబుతున్నారు. దీంతో గతేడాదితో పోలిస్తే మొత్తం అమ్మకాలు రూ.600 కోట్లకు పైగా పెరిగే అవకాశం ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శివారు గ్రామ పంచాయతీల్లో జరిగిన ఎన్నికల కారణంగా కూడా మద్యం అమ్మకాలు ఓ రేంజ్ లో పెరిగాయి. ఈ కారణంగా సుమారు రూ.200 కోట్ల అదనపు ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చినట్లు సమాచారం.
అయితే.. ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల మేరకు డిసెంబర్ 31వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటాయి. బార్లు, క్లబ్బులు, టూరిజం ప్రాంతాల్లోని హోటళ్లు, అలాగే ప్రత్యేకంగా అనుమతి పొందిన ఈవెంట్ నిర్వాహకులకు రాత్రి 1 గంట వరకు పని చేయడానికి అనుమతి ఇచ్చారు.
అయితే.. కొత్త ఏడాది సంబరాలు, వెసులుబాటు వేళలు, కొత్త పాలసీ ప్రభావం.. ఈ మూడు కలిసి ఈసారి డిసెంబర్ 31ను లిక్కర్ కిక్కు డేగా మార్చబోతున్నాయ్ అంటూ పలువురు పేర్కొంటున్నారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
