Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan RC 15: కొండారెడ్డి బురుజు దగ్గర రాజకీయ సభ పెట్టిన రామ్ చరణ్.. భారీగా చేరుకున్న ఫ్యాన్స్

నిన్న హైదరాబాద్ చార్మినార్ దగ్గర కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టిన దర్శకుడు శంకర్.. ఈరోజు తన షూటింగ్ ను కర్నూలుకి షిప్ట్ చేశాడు డైరెక్టర్ శంకర్. ఈ రోజు రాయలసీమలో ప్రసిద్దిగాంచిన కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర  RC 15 మూవీ షూటింగ్  జరుపుకుంటుంది.

Ram Charan RC 15: కొండారెడ్డి బురుజు దగ్గర రాజకీయ సభ పెట్టిన రామ్ చరణ్.. భారీగా చేరుకున్న ఫ్యాన్స్
Rc15 Shooting
Follow us
Surya Kala

|

Updated on: Feb 10, 2023 | 1:48 PM

ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే..  పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ఆర్ సీ 15 వర్కింగ్ టైటిల్ పేరుతో షూటింగ్ జరుపుకొంటుంది. గత కొంతకాలంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన చిత్ర యూనిట్ మళ్ళీ కొత్త షెడ్యూల్ ను మొదలు పెట్టింది. నిన్న హైదరాబాద్ చార్మినార్ దగ్గర కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టిన దర్శకుడు శంకర్.. ఈరోజు తన షూటింగ్ ను కర్నూలుకి షిప్ట్ చేశాడు డైరెక్టర్ శంకర్. ఈ రోజు రాయలసీమలో ప్రసిద్దిగాంచిన కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర  RC 15 మూవీ షూటింగ్  జరుపుకుంటుంది. భారీ సంఖ్యలో అభిమానులు షూటింగ్ స్పాట్ చేసుకున్నారు. దీంతో పోలీసులు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ విధించారు.  బురుజు సమీపంలో ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని ప్రకటించారు.

కొండారెడ్డి బురుజు దగ్గర జరుగుతున్న షూటింగ్ లో హీరో రామ్ చరణ్ తేజ్ఎం శ్రీకాంత్, రాజీవ్ కనకాలు పాల్గొన్నారు. ఇక్కడ కొండారెడ్డి బురుజుకు అభ్యుదయం అనే రాజకీయ పార్టీ బ్యానర్ కట్టి.. రాజకీయ సభ సన్నివేశం షూట్  చేస్తోంది చిత్ర యూనిట్. సినిమా షూటింగ్ ను చూడడానికి అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.

రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో తండ్రి కొడుకులుగా కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.. కియారా అద్వానీ, అంజలి లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తోండగా.. తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీని, ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..