AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Crime: తాగిన మైకంలో ప్రాణ స్నేహితుడి హత్య! అనాథలైన చిన్నారులు..

వారిద్దరూ ప్రాణ స్నేహాతులు.. ప్రతి రోజు కలుసుకుంటారు. ఈ ఇద్దరి ఇళ్ళు కూడా పక్క పక్కనే ఉంటాయి. ప్రతి రోజు కలిసి మెలిసి తిరుగుతారు. ఐతే ఈ ఇద్దరికి తాగుడు అలవాటు ఉంది. తగిన మత్తులో స్నేహితులిద్దరూ గొడవ పడ్డారు. చిన్నపాటి గొడగా ప్రారంభమై ఆ తర్వాత అది హద్దులు దాటింది. దీంతో తాగిన మైకంలో ఒకరు మరొకరిని హత్య చేశారు. దీంతో మృతి చెందిన స్నేహితుడి పిల్లలు అనాథలుగా మిగిలారు. తప్పు తెలుసుకున్న నిందితుడు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి..

Telangana Crime: తాగిన మైకంలో ప్రాణ స్నేహితుడి హత్య! అనాథలైన చిన్నారులు..
Nagaraju
G Sampath Kumar
| Edited By: Srilakshmi C|

Updated on: Aug 15, 2023 | 1:37 PM

Share

కరీంనగర్, ఆగస్టు 15: వారిద్దరూ ప్రాణ స్నేహాతులు.. ప్రతి రోజు కలుసుకుంటారు. ఈ ఇద్దరి ఇళ్ళు కూడా పక్క పక్కనే ఉంటాయి. ప్రతి రోజు కలిసి మెలిసి తిరుగుతారు. ఐతే ఈ ఇద్దరికి తాగుడు అలవాటు ఉంది. తగిన మత్తులో స్నేహితులిద్దరూ గొడవ పడ్డారు. చిన్నపాటి గొడగా ప్రారంభమై ఆ తర్వాత అది హద్దులు దాటింది. దీంతో తాగిన మైకంలో ఒకరు మరొకరిని హత్య చేశారు. దీంతో మృతి చెందిన స్నేహితుడి పిల్లలు అనాథలుగా మిగిలారు. తప్పు తెలుసుకున్న నిందితుడు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నేరం అంగీకరించి లొంగిపోయాడు. కరీంనగర్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కరీంనగర్ జిల్లా రేకుర్తిలో దారుణహత్య జరిగింది. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య మాటామాటా పెరిగి హత్యకు దారి తీసిన ఘటన విషాదం రేపింది. రేకుర్తికి చెందిన మావురం నాగరాజు, అతని ఇంటికెదురుగా ఉంటున్న ఆటో డ్రైవర్ అజయ్ ఇద్దరూ స్నేహితులు. నాగరాజు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈరోజు ఉదయం మందు పార్టీ చేసుకుంటున్న తరుణంలో ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యా ఏదో మాటా మాటా పెరగడంతో అజయ్ బీరు సీసా పగులగొట్టి నాగరాజును పొడిచాడు. అప్పటికే రెండుమూడు పోట్లు పడ్డ నాగరాజు అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో నాగరాజును ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే తరలించినా లాభం లేకపోయింది. నాగరాజు మృతితో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

నాగరాజు భార్య శాతవాహన యూనివర్సిటీలో సబ్ స్టాప్ పని చేస్తోంది. కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేయగా.. నిందితుడు అజయ్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నాగరాజు బిడ్డలు కన్నీరు మున్నీరుగా విలపించారు. తనకు తండ్రి కావాలంటూ రోధించింది. అజయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అజయ్ తల్లిదండ్రులే నాగరాజును ఆసుపత్రికి తీసుకెళ్లారు. బతికించడానికి నానా ప్రయత్నాలు చేశారు. ఇటీవల మద్యం మత్తులో హత్య చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.