AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: ‘తెలంగాణకు 4 కేంద్ర మంత్రి పదవులు అడుగుతాం’.. సీఎం రేవంత్ రెడ్డి..

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. తెలంగాణలో మొత్తం 17 సీట్లకుగానూ 8 నుంచి 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సర్వే సంస్థలు తెలిపాయి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వస్తాయని ధీమాను వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు 70 నుంచి 80 స్థానాలు చూపిస్తున్న నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఇండి కూటమి గెలుస్తుందన్నారు.

CM Revanth Reddy: 'తెలంగాణకు 4 కేంద్ర మంత్రి పదవులు అడుగుతాం'.. సీఎం రేవంత్ రెడ్డి..
Revanth Reddy
Srikar T
|

Updated on: Jun 01, 2024 | 8:27 PM

Share

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. తెలంగాణలో మొత్తం 17 సీట్లకుగానూ 8 నుంచి 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సర్వే సంస్థలు తెలిపాయి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వస్తాయని ధీమాను వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు 70 నుంచి 80 స్థానాలు చూపిస్తున్న నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఇండి కూటమి గెలుస్తుందన్నారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తెలంగాణకు 4 కేంద్రమంత్రి పదవులు అడుగుతాం అని తెలిపారు.

తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇండియా కూటమికు 8 సీట్లు, ఎన్డీయేకు 7, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించనున్నట్లు టీవీ9 పోల్ స్ట్రాట్, పీపుల్స్ ఇన్‌సైట్ ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. అలాగే ఆరా మస్తాన్ సర్వే ప్రకారం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8 పార్లమెంట్ స్థానాలు వస్తాయన్నారు. ఇక బీజేపీకు 8 నుంచి 9 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటుదని తెలిపింది. ఇతరులకు 1 స్థానం అని ప్రకటించింది. అందులో బీఆర్ఎస్, ఎంఐఎంలకు ఎవరికైనా రావొచ్చు అని చెబుతున్నారు. ఇదే ఆరా మస్తాన్ గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కచ్చితమైన అంచనాలను వెలువరించారు. అలాగే చాణక్య ఎక్స్ సర్వేలో కాంగ్రెస్ కు 9 నుంచి 11 స్థానాలు, బీజేపీకి 4 నుంచి 6 సీట్లు, బీఆర్ఎస్ కు కేవలం 0 నుంచి 1 సీటు రావొచ్చని అంచనా వేసింది. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ తమకు 12 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..