Telangana: కుప్పకూలిన SLBC సొరంగం.. టన్నెల్లో 50 మంది కార్మికులు..! హుటాహుటిన బయల్దేరిన మంత్రి ఉత్తమ్..
ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల క్రితం మళ్లీ పనులు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో టన్నెల్లో 50 మంది కార్మికులు ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి. ఘటనా స్థలానికి వెళుతున్నారు నాగర్ కర్నూల్ ఎస్పీ భవ్ గైక్వాడ్.

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో ప్రమాదం జరిగింది..ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలింది. 14వ కి.మీ దగ్గర మూడు మీటర్ల మేర పైకప్పు కుంగింది. ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల క్రితం మళ్లీ పనులు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో టన్నెల్లో 50 మంది కార్మికులు ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి. ఘటనా స్థలానికి వెళుతున్నారు నాగర్ కర్నూల్ ఎస్పీ భవ్ గైక్వాడ్. ఐదుగురు కార్మికులు అందులో చిక్కుకుపోయినట్లు చెబుతున్నారాయన. వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరా తీస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో సంఘటనా స్థలానికి బయల్దేరినట్టుగా తెలిసింది.
ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. అధికారులకు కీలక ఆదేశాలు:
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదం పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పై కప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్. ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు.




