AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎస్‌ఐపై దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు..!

నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అరవింద్ విజయోత్సవ ర్యాలీలో బిగ్ ఫైట్ జరిగింది. డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ మీదే దాడికి పాల్పడ్డారు బీజేపీ కార్యకర్తలు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఎస్ఐ.. బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఫలితంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో రాఘవపేట్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గెలిచిన ఆనందంలో రాఘవపేటలో డీజేతో సంబరాలు జరుపుకుంటున్నారు ధర్మపురి అరవింద్, బీజేపీ కార్యకర్తలు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న మల్లాపూర్ ఎస్‌ఐ పృధ్వీధర్ గౌడ్.. […]

ఎస్‌ఐపై దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 25, 2019 | 12:46 PM

Share

నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అరవింద్ విజయోత్సవ ర్యాలీలో బిగ్ ఫైట్ జరిగింది. డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ మీదే దాడికి పాల్పడ్డారు బీజేపీ కార్యకర్తలు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఎస్ఐ.. బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఫలితంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో రాఘవపేట్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

గెలిచిన ఆనందంలో రాఘవపేటలో డీజేతో సంబరాలు జరుపుకుంటున్నారు ధర్మపురి అరవింద్, బీజేపీ కార్యకర్తలు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న మల్లాపూర్ ఎస్‌ఐ పృధ్వీధర్ గౌడ్.. అర్థరాత్రి సమయంలో డీజేకు పర్మిషన్ లేదని చెప్పగా.. బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు.

ఎంత చెప్పినా బీజేపీ నేతలు వినకపోవడంతో ఎస్‌ఐ జరుగుతోన్న తతంగాన్ని తన సెల్‌ఫోన్‌తో చిత్రీకరించడం మొదలుపెట్టారు. అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు ఎస్ఐ మొబైల్ ఫోన్ లాక్కొని ధ్వంసం చేశారు. దీంతో ఎస్ఐ కోపంతో బీజేపీ కార్యకర్తలపై చేయిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐకు బీజేపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఎస్‌ఐపై దాడికి దిగిన బీజేపీ నేతలు, కార్యకర్తలపై కేసునమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.