AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏక్‌నాథ్ షిండే వర్గంలో మొదలైన అసంతృప్తి.. 22 మంది ఎమ్మెల్యేలతో సహా 9 మంది ఎంపీలు ?

శివసేనను రెండుగా చీల్చి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఏక్‌నాథ్ షిండేకు ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత మొదలైంది. బీజేపీతో తన ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలతో సహా 9 మంది ఎంపీలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ(యూబీటీ)కి చెందిన సామ్నా పత్రిక పేర్కొంది.

ఏక్‌నాథ్ షిండే వర్గంలో మొదలైన అసంతృప్తి.. 22 మంది ఎమ్మెల్యేలతో సహా 9 మంది ఎంపీలు ?
Eknath Shinde
Aravind B
|

Updated on: May 30, 2023 | 7:30 PM

Share

శివసేనను రెండుగా చీల్చి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఏక్‌నాథ్ షిండేకు ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత మొదలైంది. బీజేపీతో తన ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలతో సహా 9 మంది ఎంపీలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ(యూబీటీ)కి చెందిన సామ్నా పత్రిక పేర్కొంది. షిండే వర్గంలోని కొంతమంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని యూబీటీ ఎంపీ వినాయక్ రౌత్ పేర్కొన్నారు. ఆ పార్టీ నుంచి బయటకు వస్తామని వారు చెప్పినట్లు తెలిపారు. ఎన్డీయే భాగస్వామ్యంలో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని తెలిపినట్లు వెల్లడించారు.

బీజేపీ-షిండేకు చెందిన శివసేన భాగస్వామ్యంలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గజానన్ కీర్తికార్ బహిరంగంగానే బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సామ్నా తెలిపింది. బీజేపీ నుంచి అంతర్గతంగా వారు వివక్షను ఎదుర్కొంటునట్లు తెలిపారు. ‘మేము 13 మంది ఎమ్మెల్యేలం ఉన్నామని.. ఎన్డీయే భాగస్వామ్యంలో మా సమస్యలు పరిష్కారమయ్యేలా లేవని గజానన్ కీర్తికార్ గతంలోనే అన్నారు. వ్యక్తిగత గౌరవాన్ని డబ్బులతో కొనలేరనే విషయం మరోసారి రుజువైంది. ఈ సారి 22 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని షిండే నేతృత్వంలోని శివసేన నేతలు ఇప్పటికే చెప్పారు.అయితే ఎన్డీయే భాగస్వామ్యంలోని షిండే వర్గానికి 22 సీట్లు ఇచ్చే అవకాశాలు లేవని సామ్నా వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం.