Telangana: ఇదో వింత ఆచారం.. ఊరు ఊరంతా బండరాయిపైనే భోజనాలు.. పచ్చిపులుసే పరమాన్నం.. ఎక్కడంటే

శ్రావణ మాసంలో చివరి శనివారం రోజున గ్రామస్తులందరూ కలిసి ప్రతి ఇంటి నుంచి బియ్యం, నూనె,చింతపండు, ఉల్లిగడ్డలు అన్నీ సేకరించి పాదం బండ దగ్గరికి వచ్చి వంటలు చేసుకుంటారు.

Telangana: ఇదో వింత ఆచారం.. ఊరు ఊరంతా బండరాయిపైనే భోజనాలు.. పచ్చిపులుసే పరమాన్నం.. ఎక్కడంటే
Sri Kurumurthy Swamy
Follow us

|

Updated on: Aug 28, 2022 | 1:59 PM

Sri Kurumurthy Swamy Temple: పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి అటువైపు వెళ్తూ పాదం మోపాడనీ.. స్వామి వారి పాదానికి గుడి కట్టించి ఆనవాయితీ ప్రకారం 200 సంవత్సరాల నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అక్కడి భక్తులు. బండ రాతిపై గ్రామస్తులంతా కలిసి శ్రావణమాసం చివరి శనివారం అక్కడే భోజనాలు చేసుకుని వనభోజనం చేస్తారు భక్తులు. బండరాయిపై భోజనాలు చేయడం ఏంటి ఆశ్చర్య పోతున్నారా.? కానీ నిజంగానే ఇక్కడి ప్రజలు అలానే భోజనం చేస్తారు. ఈ వింత ఆచారం ఎక్కడ జరుగుతుంది..? అసలు విషయం ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వెంకటగిరి గ్రామస్తులు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం చివరి శనివారం రోజున గ్రామ సమీపంలోని కురుమూర్తి స్వామి పాదం బండపై భోజనం చేస్తారు. అది కూడా బండ పై ఎలాంటి విస్తరాకులు గానీ ప్లేట్లు గానీ లేకుండా, రాతి బండ పై అన్నం పెట్టించుకుని పచ్చిపులుసు వేసుకుని గ్రామస్తులు అందరూ కలిసి తింటారు. వెంకటేశ్వర స్వామి, కురుమూర్తి జాతర కు వెళుతూ మా గ్రామ సమీపంలోని బండ పై కాలు మోపడం తో ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరిగేదని ఇక్కడి పూర్వీకులు చెప్పినట్టుగా గ్రామస్తుల నమ్మకం.

శ్రావణ మాసంలో చివరి శనివారం రోజున గ్రామస్తులందరూ కలిసి ప్రతి ఇంటి నుంచి బియ్యం, నూనె,చింతపండు, ఉల్లిగడ్డలు అన్నీ సేకరించి పాదం బండ దగ్గరికి వచ్చి వంటలు చేసుకుంటారు. రాతి బండ పై ఎలాంటి విస్తరాకులు లేకుండా సహాపంక్తి భోజనం చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, గొడ్డు గోదా గ్రామస్తులంతా క్షేమంగా ఉంటారని ఇక్కడ భక్తుల నమ్మకం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?