కామారెడ్డిలో రైతుల ఘర్షణ..

కామారెడ్డి జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రం దగ్గర దుమారం చెలరేగింది. దళారులను తీసుకొచ్చి అధికారులు తమను దోచుకుంటున్నారంటూ రైతులు ఆందోళనకు దగారు. అదికాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీసి కుస్తీ పట్ల దాకా వెళ్లింది. పిట్లం మండలంలోని తిమ్మానగర్ సొసైటీ దగ్గర కొందరు దళారులు రైతుల ముసుగులో వచ్చి జొన్నలు విక్రయిస్తున్నారని.. దాన్ని అడ్డుకుంటే అధికారులు తమను వేధింపులకు గురిచేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బినామీ పేర్లతో దందా చేస్తోన్న దళారులను […]

కామారెడ్డిలో రైతుల ఘర్షణ..
Follow us

| Edited By:

Updated on: May 18, 2019 | 4:49 PM

కామారెడ్డి జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రం దగ్గర దుమారం చెలరేగింది. దళారులను తీసుకొచ్చి అధికారులు తమను దోచుకుంటున్నారంటూ రైతులు ఆందోళనకు దగారు. అదికాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీసి కుస్తీ పట్ల దాకా వెళ్లింది. పిట్లం మండలంలోని తిమ్మానగర్ సొసైటీ దగ్గర కొందరు దళారులు రైతుల ముసుగులో వచ్చి జొన్నలు విక్రయిస్తున్నారని.. దాన్ని అడ్డుకుంటే అధికారులు తమను వేధింపులకు గురిచేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బినామీ పేర్లతో దందా చేస్తోన్న దళారులను వెంటనే శిక్షించాలని, ఎమ్మార్వో చేత విచారణ జరిపించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.