AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక జిల్లాల పర్యటనలు షురూ!

హైదరాబాద్‌: జిల్లాల పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. నిర్మాణంలో ఉన్న రామగుండం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఆయన పయనమయ్యారు. తొలుత రామగుండం వెళ్లనున్న సీఎం అక్కడ 1600 మెగావాట్ల సామర్థ్యంతో ఎన్టీపీసీ నిర్మిస్తున్న విద్యుత్‌ ప్లాంట్‌ను పరిశీలించి పనుల్లో పురోగతి తెలుసుకుంటారు. అక్కడే ఎన్టీపీసీ, జెన్‌కో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ప్లాంట్‌ సంబంధిత అంశాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్‌ పైనా చర్చిస్తారు. రాత్రికి కరీంనగర్‌లో […]

ఇక జిల్లాల పర్యటనలు షురూ!
Ram Naramaneni
|

Updated on: May 18, 2019 | 4:34 PM

Share

హైదరాబాద్‌: జిల్లాల పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. నిర్మాణంలో ఉన్న రామగుండం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఆయన పయనమయ్యారు. తొలుత రామగుండం వెళ్లనున్న సీఎం అక్కడ 1600 మెగావాట్ల సామర్థ్యంతో ఎన్టీపీసీ నిర్మిస్తున్న విద్యుత్‌ ప్లాంట్‌ను పరిశీలించి పనుల్లో పురోగతి తెలుసుకుంటారు. అక్కడే ఎన్టీపీసీ, జెన్‌కో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ప్లాంట్‌ సంబంధిత అంశాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్‌ పైనా చర్చిస్తారు. రాత్రికి కరీంనగర్‌లో బస చేయనున్న సీఎం.. రేపు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. కాళేశ్వరం ముక్తేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. జులైలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఆ దిశగా పనుల పురోగతి, ఇతర అంశాలపై అధికారులు, ఇంజినీర్లతో ముఖ్యమంత్రి సమీక్షిస్తారు.