Hyderabad: హెచ్‌సీయూలో ఉద్రిక్తత.. బీబీసీ డాక్యుమెంటరీ vs కశ్మిరీ ఫైల్స్..

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో హైడ్రామా చోటు చేసుకుంది. రెండు చిత్రాల ప్రదర్శన కోసం యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు పోటీపడ్డాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల మధ్య..

Hyderabad: హెచ్‌సీయూలో ఉద్రిక్తత.. బీబీసీ డాక్యుమెంటరీ vs కశ్మిరీ ఫైల్స్..
Hcu Student Unions Clash
Follow us

|

Updated on: Jan 26, 2023 | 9:02 PM

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో హైడ్రామా చోటు చేసుకుంది. రెండు చిత్రాల ప్రదర్శన కోసం యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు పోటీపడ్డాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల మధ్య వామపక్ష విద్యార్థి సంఘం అయిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SFI) కార్యకర్తలు బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ని హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రదర్శించారు. లేడీస్‌ హాస్టల్‌లో ఈ డాక్యుమెంటరీని ప్లే చేశారు. అదే సమయంలో ఏబీవీపీ కార్యకర్తలు కశ్మీర్‌ ఫైల్స్ సినిమాను నార్త్ బ్లాక్‌లో చూపించారు. భారత ప్రభుత్వం నిషేధించిన ఈ డాక్యుమెంటరీని యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రదర్శించడం సరికాదంటూ యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఏబీవీపీ కార్యకర్తలు.

అంతకు ముందు కాసేపు హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీబీసీ వీడియో ప్లే చేసేందుకు SFI విద్యార్థుల సిద్ధమవ్వగా.. పోటీగా కశ్మీర్‌ఫైల్స్‌ ప్రదర్శించేందుకు ABVP నేతలు ప్రయత్నించారు. అయితే ఏబీవీపీ కార్యకర్తలను భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో హైటెన్షన్ క్రియేట్ అయ్యింది. వర్సిటీ యాజమాన్యం లెఫ్ట్‌ యూనియన్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ABVP కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భద్రత పెంచారు.

ఇవి కూడా చదవండి

కాగా, బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’డాక్యుమెంటరీని భారత్‌లో ప్రదర్శించవద్దని కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే దానిని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. మరికొన్ని యూనివర్సిటీలలోన ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించే యత్నాలు జరగడం గమనార్హం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..