AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో మరో చిన్నారిపై డాగ్ ఎటాక్.. స్కూల్ ప్రిన్సిపల్‌పై పేరెంట్స్ ఫైర్..

Dog Attack: మహానగరంలో కుక్కల దాడులకు ఫుల్‌స్టాప్ పడడంలేదు. హైదరాబాద్‌లో మరో చిన్నారిపై డాగ్ ఎటాక్ చేసింది. ఘటనకు కారణమైన ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని చిన్నారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో మరో చిన్నారిపై డాగ్ ఎటాక్.. స్కూల్ ప్రిన్సిపల్‌పై పేరెంట్స్ ఫైర్..
Dogs Attack
Venkata Chari
|

Updated on: Jun 23, 2023 | 4:44 AM

Share

హైదరాబాద్ మహానగరంలో వీధి కుక్కలే కాదు పెంపుడు కుక్కలు సైతం రెచ్చిపోతున్నాయి. చిన్నారులపై దాడులకు పాల్పడుతున్నాయి. నగరంలోని సనత్ నగర్‌‌లో దారుణం చోటు చేసుకుంది. సెయింట్ థెరిస్సా స్కూల్‌లో విద్యార్థులపై కుక్క దాడికి పాల్పడింది. చిన్నారి స్కూల్ గ్రౌండ్‌లో ఆడుకుంటుండగా.. ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన విద్యార్థులు టీచర్లకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఉపాధ్యాయులు కుక్కదాడిలో గాయపడ్డ చిన్నారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారిపై దాడికి పాల్పడ్డ కుక్క ప్రిన్సిపల్ పెంపుడు కుక్కగా గుర్తించారు. దీంతో పాఠశాల ప్రిన్సిపల్ స్కూల్‌కు కుక్కను ఎలా తీసుకొస్తారని స్టూడెంట్ పేరెంట్స్‌ ఫైర్ అవుతున్నారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో కుక్కల దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా.. ఏక్కడో ఒకచోట కుక్కదాడులు జరుగుతూనే ఉన్నాయి. చిన్నారులు, పెద్దలు డాగ్ ఎటాక్స్‌కు గురవుతూనే ఉన్నారు. కుక్కలు కన్పిస్తే చాలు చిన్నలు, పెద్దలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డాట్ ఎటాక్స్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మొన్న వార్డ్ ఆఫీసుల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ సైతం నగరంలో కుక్కల దాడులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంతలోనే మరో ఘటన జరగడం.. అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..