Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS Plenary: 27న గులాబీ పండుగ.. సైబ‌రాబాద్ ప‌రిధిలో ట్రాఫిక్ ఆంక్షలు..

టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.. హైదరాబాద్‌లోని (Hyderabad) హెచ్‌ఐసీసీ వేదికగా ఏప్రిల్ 27, మంగళవారం జరిగే ప్లీనరీ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

TRS Plenary: 27న గులాబీ పండుగ.. సైబ‌రాబాద్ ప‌రిధిలో ట్రాఫిక్ ఆంక్షలు..
Trs Plenary
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 26, 2022 | 2:21 PM

టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.. హైదరాబాద్‌లోని (Hyderabad) హెచ్‌ఐసీసీ వేదికగా ఏప్రిల్ 27, మంగళవారం జరిగే ప్లీనరీ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులతో పాటు మొత్తం ఆరు వేల మంది దాకా తరలిరానున్నారు. గులాబీ శ్రేణులు (TRS leaders) భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నెల 27న హెచ్ఐసీసీలో నిర్వ‌హించే టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప‌లు ఆంక్ష‌లు విధించారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు చేపడుతున్నారు.

హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాలైన కొత్తగూడ-హైటెక్స్‌, సైబర్‌ టవర్స్‌-ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్‌ టూ కొత్తగూడ ప్రాంతాల్లోని కార్యాలయాల నిర్వాహకులు వారి సమయ వేళలను మార్చుకోవాలని అధికారులు సూచించారు.

ఉద‌యం 9 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 4 నుంచి 7 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ర‌ద్దీ ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని, ఈ స‌మయాల్లో ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు.

ఇవి కూడా చదవండి: Elon Musk Buy Twitter: ఎలన్‌ మస్క్‌ చేతిలోకి ట్విట్టర్‌ పిట్ట.. 44 బిలియన్‌ డాలర్లకు డీల్‌..

Teething in Babies: మీ పిల్లలకి పళ్ళు వస్తున్నాయా.. అప్పుడు మీరు చేయాల్సిన పనులు ఇవే..