AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: తెలంగాణలో తొలిసారిగా ఆన్‌లైన్ నామినేషన్.. ఎక్కడి నుంచి దాఖలైందంటే..?

అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో భారత ఎన్నికల సంఘం అనేక సంస్కరణలను తీసుకువచ్చింది. ఫలితంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఒకరు ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు చేశారు. అమెరికాలో వర్క్ పర్మిట్‌పై పనిచేస్తున్న సుధీర్ అన్‌లైన్‌లో తన నామినేషన్ దాఖలు చేశారు.

Telangana Elections: తెలంగాణలో తొలిసారిగా ఆన్‌లైన్ నామినేషన్.. ఎక్కడి నుంచి దాఖలైందంటే..?
Jalagam Sudhir
M Revan Reddy
| Edited By: |

Updated on: Nov 03, 2023 | 5:17 PM

Share

ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ అంటే మన అందరికి తెలుసు..! ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పిస్తారు. కానీ మనం ఎప్పుడు ఆన్‌లైన్‌లో నామినేషన్ వేసిన దాఖలాలు లేవు. అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో భారత ఎన్నికల సంఘం అనేక సంస్కరణలను తీసుకువచ్చింది. ఫలితంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఒకరు ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు చేశారు.

తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మొదటి రోజే పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్‌ నేతలు నామినేషన్ల పర్వంలో బోణీ చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశాన్ని తొలిసారిగా భారత ఎన్నికల సంఘం కల్పించింది. కోదాడ నియోజక వర్గానికి చెందిన జలగం సుధీర్ అమెరికాలో వర్క్ పర్మిట్‌పై పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా కోదాడ పరిసర ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న జలగం సుధీర్, ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. ఇంతలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 3 నుంచి మొదలైంది. దీంతో అన్‌లైన్‌లో తన నామినేషన్ దాఖలు చేశారు సుధీర్.

అన్‌‌లైన్‌‌లో నామినేషన్ దాఖలు చేసేందుకు అవసరమైన ఎలక్షన్ కమీషన్ నిబంధనల ప్రకారం అన్ని డాక్యుమెంట్లు అందచేయటానికి సిద్దంగా ఉన్నానని, ఈ ఆన్‌లైన్ ప్రాసె‌స్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అందించాలని జలగం సుధీర్ కోదాడ ఎన్నికల అధికారులు లేఖ రాశారు. సువిధ పోర్టల్ ద్వారా ఎన్నికల్లో ఆన్‌లైన్ నామినేషన్ దాఖలు చేసుకోవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో సువిధ పోర్టల్ ద్వారా కోదాడ అసెంబ్లి నియోజకవర్గం నుండి ఆన్‌లైన్ ద్వారా స్వతంత్ర అభ్యర్దిగా జలగం సుధీర్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ ఎన్నికల అధికారులు ఆమోదిస్తే.. తెలంగాణలో మొట్ట మొదటి ఆన్‌లైన్ నామినేషన్ కోదాడ నుండే దాఖలు అయినట్లుగా భావించవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..