Telangana: సోషల్ మీడియా అడ్డాగా రెచ్చిపోయాడు.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వంద మందికిపైగా..
Telangana: సోషల్ మీడియాలో మోసాలకు అడ్డేలేకుండా పోతోంది. సామాన్యులనే కాదు, పోలీసులనూ వదలడం లేదు నేరగాళ్లు.
Telangana: సోషల్ మీడియాలో మోసాలకు అడ్డేలేకుండా పోతోంది. సామాన్యులనే కాదు, పోలీసులనూ వదలడం లేదు నేరగాళ్లు. ఓ ఎస్సై పేరుతో ఫేక్ అకౌంట్స్ తెరిచి, యువతులకు గాలం వేశాడు. అవును.. టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చిందో, అదే స్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి, డబ్బులు వసూలు చేసే ముఠాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అధికారులు మొదలు అమాయకుల వరకు, చాలామంది ఫేక్గాళ్ల ఉచ్చులో పడిపోతున్నారు. తాజాగా ఓ ఎస్సై పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి, యువతులను మోసం చేసిన ఘటన వరంగల్లో వెలుగుచూసింది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో నకిలీ ఐడీలు సృష్టించి, అమ్మాయిలకు రెక్వెస్ట్లు పెట్టి ఫ్రెండ్షిప్ చేశాడు ఓ వ్యక్తి.
కొందరిని పెళ్లి చేసుకుంటానని నన్మించి డబ్బులు వసూలు చేశాడు. కడప జిల్లా రాయచోటికి చెందిన ఎంకాల ఆంజనేయులు అలియాస్ అంజికి 2006లో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్య ఉపాధి కోసం కువైట్కు వెళ్లి అక్కడే స్థిరపడింది. ఆంజనేయులుకు జల్సా ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో, అక్రమంగా డబ్బులు సంపాదించాలని స్కెచ్ వేశాడు. ఇందుకు వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్సై కిశోర్కుమార్ ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఫొటోలను డౌన్లోడ్ చేశాడు. ఆ ఎస్సై పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతా తెరిచాడు. ఆ ఖాతా నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 100 మందికి పైగా యువతులు, మహిళలతో నిత్యం చాటింగ్ చేసేవాడు. ప్రస్తుతం తాను సీఐ ట్రైనింగ్లో ఉన్నానని, తనకు సకాలంలో వేతనం అందడం లేదని, తన అకౌంట్కు డబ్బులు పంపించాలని కొందరిని కోరాడు. ట్రైనింగ్ పూర్తయ్యాక తిరిగి చెల్లిస్తానని చెప్పడంతో చాలామంది మహిళలు డబ్బులు వేశారు. ఓ యువతి ఏకంగా లక్షా డెబ్బైవేలు సమర్పించుకుంది. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి, ట్విట్టర్ ద్వారా డీజీపీ, వరంగల్ సీపీకి ఫిర్యాదు చేసింది. దింతో ఆంజనేయులు అసలు గుట్టు రట్టయ్యింది.
Also read:
Russia – Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్లో అమెరికా ఎంటరవుతుందా? ఆ ప్రకటన దేనికి సంకేతం..!
Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా జీతాలు పెంచిన సర్కార్..