AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మావోయిస్టు క‌ద‌లిక‌ల‌పై నిరంత‌ర అప్రమత్తత అవ‌స‌రం.. డీజీపీ అంజనీ కుమార్ అధికారులకు ఆదేశం

తెలంగాణలో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా అది రాష్ట్ర అభివృద్ధి పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఇలాంటి ఈపరిస్థితుల్లో పోలీస్ అధికారులు మ‌రింత అప్రమ‌త్తంగా ఉండాలని డీజీపీ అంజ‌నీ కుమార్ ఆదేశించారు. దక్షిణ బస్తర్‌లోని అరుణ‌పూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఏప్రిల్ 26న జ‌రిగిన మందుపాత‌ర పేలుడులో 10 మంది భ‌ద్రతా సిబ్బందితోపాటు ఒక పౌరుడు మ‌ర‌ణించిన విషయం తెలిసిందే.

Telangana: మావోయిస్టు క‌ద‌లిక‌ల‌పై నిరంత‌ర అప్రమత్తత అవ‌స‌రం.. డీజీపీ అంజనీ కుమార్ అధికారులకు ఆదేశం
Dgp Anjani Kumar
Aravind B
|

Updated on: May 04, 2023 | 4:51 PM

Share

తెలంగాణలో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా అది రాష్ట్ర అభివృద్ధి పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఇలాంటి ఈపరిస్థితుల్లో పోలీస్ అధికారులు మ‌రింత అప్రమ‌త్తంగా ఉండాలని డీజీపీ అంజ‌నీ కుమార్ ఆదేశించారు. దక్షిణ బస్తర్‌లోని అరుణ‌పూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఏప్రిల్ 26న జ‌రిగిన మందుపాత‌ర పేలుడులో 10 మంది భ‌ద్రతా సిబ్బందితోపాటు ఒక పౌరుడు మ‌ర‌ణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వామ‌ప‌క్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల పోలీస్ అధికారుల‌తో ఆయన గురువారం త‌న కార్యాల‌యం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ‌ర్క్‌షాప్ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ ప్రముఖులు, వీవీఐపీల ప‌ర్యటన స‌మ‌యంలో భ‌ద్రతా బ‌ల‌గాలు సంచరించే సమయంలో త‌గు జాగ్రత్తలు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. అలాగే రాష్ట్రాల స‌రిహ‌ద్దుల ప్రాంతాల్లో మావోయిస్టుల యాక్షన్ టీంల క‌ద‌లిక‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని, ఆ విష‌యంలో మ‌రింత అప్రత్తంగా ఉండాల‌న్నారు.

ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఐటీ ప‌రిశ్రమ‌లు, అనేక‌ బ‌హుళ‌జాతి సంస్థలు హైద‌రాబాద్ కేంద్రంగా త‌మ కార్యాల‌యాలు ఏర్పాటు చేసుకున్నాయ‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఏ చిన్న సంఘ‌ట‌న జ‌రిగినా అంత‌ర్జాతీయంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంద‌ని వివరించారు. అలాగే మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహ‌రిస్తున్నార‌ని, ఒక‌ర్ని దెబ్బతీయ‌డం వ‌ల్ల వేలాది మందిని భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసేలా చేస్తున్నారని.. కాబ‌ట్టి ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్రతిక్షణం అప్రమ‌త్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ‌లో వామ‌ప‌క్ష తీవ్రవాదం పూర్తిగా అంత‌రించిపోయింద‌ని.. దీనికి పోలీస్ శాఖ నిరంత‌ర కృషే కార‌ణ‌మ‌న్నారు. మావోయిస్టు చ‌ర్యల‌కు సంబంధించిన కీల‌క దాడుల్ని వివ‌రించారు. రాష్ట్రంలో 80శాతం కొత్తగా విధుల్లో చేరిన పోలీసులు ఉండ‌టం వ‌ల్ల మావోయిస్టు వ్యూహాలు, చ‌ర్యలు, దాడుల‌పై మ‌రింత అవ‌గాహ‌న ఏర్పరుచుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Follow Us
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో