AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MIM vs BRS: మాకూ రాజకీయం తెలుసు.. కారుపై కస్సుమంటున్న కైట్‌.. కారణం అదేనా..

పొలిటికల్‌ దోస్తుల మధ్య వైరం షురూ అయ్యిందా...? స్నేహమంటే ఇదేరా అంటూ ముందుకు సాగిన రెండు పార్టీలకు మధ్య బ్రేకప్‌ అయినట్లేనా...? మొన్నటిదాకా కారు మీద ఎగురుకుంటూ వెళ్లిన కైటు... ఇప్పుడదే కారుతో ఫైటుకు సిద్ధమైందా...? ఎన్నికల ఫలితాల తర్వాత

MIM vs BRS: మాకూ రాజకీయం తెలుసు.. కారుపై కస్సుమంటున్న కైట్‌.. కారణం అదేనా..
Asaduddin Owaisi - KCR
Shaik Madar Saheb
|

Updated on: Sep 23, 2024 | 10:55 AM

Share

పొలిటికల్‌ దోస్తుల మధ్య వైరం షురూ అయ్యిందా…? స్నేహమంటే ఇదేరా అంటూ ముందుకు సాగిన రెండు పార్టీలకు మధ్య బ్రేకప్‌ అయినట్లేనా…? మొన్నటిదాకా కారు మీద ఎగురుకుంటూ వెళ్లిన కైటు… ఇప్పుడదే కారుతో ఫైటుకు సిద్ధమైందా…? ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి సైలెంట్‌గా ఉన్న MIM… ఇప్పుడు బీఆర్ఎస్‌పై ఎందుకు సీరియస్‌ అవుతోంది…? అనేది హాట్ టాపిక్ గా మారింది..

ఎన్నికల ముందు వరకు దోస్త్‌ మేరా దోస్త్‌ అంటూ ముందుకు సాగాయి బీఆర్ఎస్‌, MIM పార్టీలు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా MIM బీఆర్‌ఎస్‌పై ఎలాంటి విమర్శలు చేయలేదు. అలాగని సపోర్ట్‌గానూ మాట్లాడలేదు. బీఆర్ఎస్‌పై దోస్తీ గురించి సైలైన్స్‌ మెయింటేన్‌ చేస్తూనే వచ్చింది. తాజాగా జైనూర్‌ ఘటన సెంట్రిక్‌గా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తన మనసులోని మాటలన్నీ బయటపెట్టారు. బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తూనే మాకు రాజకీయం తెలుసన్న డైలాగులు వదిలారు.

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌లో ఆదివాసీ మహిళపై అత్యాచారం, హత్యాయత్నం ఘటనలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. రెండు వర్గాల పరస్పర దాడులతో జైనూర్‌ రణరంగంగా మారింది. పొలిటికల్‌గానూ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జైనూర్‌ అల్లర్లకు మీరంటే మీరే కారణంటూ లీడర్లు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఇదే ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. ఎన్నడూలేనిది.. బీఆర్ఎస్‌పై ఆయన భగ్గుమన్నారు. అల్లర్ల కేసుల్లో బీజేపీ నేతల కంటే.. ఎక్కువ బీఆర్ఎస్‌ నేతలే నిందితులుగా ఉన్నారంటూ డైలాగులు పేల్చారు.

అంతేకాదు… వక్ఫ్‌ బోర్డు బిల్లుపై బీఆర్ఎస్‌ స్టాండ్‌ ఏంటని ప్రశ్నించారు అసదుద్దీన్. బీఆర్ఎస్ ఏం చెప్పకుండా మౌనంగా ఉంటే… మాకూ రాజకీయంగా వెయిట్‌ చేయించడం తెలుసంటూ కాస్త ఘాటుగా మాట్లాడారు.

వీడియో చూడండి..

మొత్తంగా… బీఆర్ఎస్‌తో దోస్తీ గురించి మాట్లాడకుండా మొన్నటిదాకా సైలెంట్‌గా ఉన్న MIM… ఇప్పుడు బహిరంగ విమర్శలు చేయడం జైనూర్‌ ఘటన సెంట్రిక్‌గా వక్ఫ్‌ బిల్లు సహా పలు అంశాలపై బీఆర్ఎస్‌ స్టాండ్‌ ఏంటని ప్రశ్నించడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరి ఎంఐఎం అధినేత వ్యాఖ్యలకు బీఆర్ఎస్‌ ఎలాంటి రియాక్ట్‌ అవుతుందో చూడాలి…!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..