AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: రోహిత్ ఒక్కడే కాదు భయ్యో.. ఆ ముగ్గురికి చావో రేవో సిరీస్.. టార్గెట్ మాత్రం అదే..?

Rohit Sharma 2027 World Cup: దక్షిణాఫ్రికా వేదికగా జరిగే 2027 ప్రపంచ కప్‌నకు ఇంగ్లాండ్ పిచ్‌లు ఒక గొప్ప సన్నాహకంగా ఉపయోగపడతాయి. ఇక్కడి కఠినమైన పరిస్థితుల్లో రాణించిన వారికే భవిష్యత్తు వన్డే జట్టులో చోటు దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మన సీనియర్ ఆటగాళ్లు ఈ సవాలును అధిగమించి, విమర్శకుల నోళ్లు మూయిస్తారో లేదో చూడాలి..!

Team India: రోహిత్ ఒక్కడే కాదు భయ్యో.. ఆ ముగ్గురికి చావో రేవో సిరీస్.. టార్గెట్ మాత్రం అదే..?
Indian Players Future In Odis
Venkata Chari
|

Updated on: Jul 13, 2026 | 8:05 AM

Share

India vs England, 2027 World Cup: ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కేవలం ఒక సాధారణ సిరీస్ మాత్రమే కాదు, టీమిండియా భవిష్యత్తును నిర్ణయించే ఒక పెద్ద అగ్నిపరీక్ష. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టులో, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మరో ముగ్గురు కీలక ఆటగాళ్లకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. ఫామ్ నిరూపించుకోకపోతే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం పొంచి ఉండడంతో, ఈ టూర్ సదరు ఆటగాళ్లకు చావో రేవో సమస్యగా మారింది.

‘రీసెట్’ మోడ్‌లో టీమిండియా.. గంభీర్ ముందున్న సవాల్..

భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో టీం ఇండియా ప్రస్తుతం రీసెట్ మోడ్ గుండా వెళుతోంది. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూడటంతో పాటు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోవడం గంభీర్ వ్యూహాలపై ఒత్తిడిని పెంచింది. జట్టులో యువ రక్తాన్ని నింపుతూనే, మరోవైపు 2027 వన్డే ప్రపంచ కప్‌నకు బలమైన పునాది వేయాల్సిన బాధ్యత ఇప్పుడు యాజమాన్యంపై ఉంది. ఈ క్రమంలో సీనియర్ల ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ‘నా పేరిట చెత్త రికార్డ్.. ప్రపంచంలో కెప్టెన్ జీరో నేనే’..: శ్రేయస్ అయ్యర్

ఇవి కూడా చదవండి

ఒత్తిడిలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ..

సారథిగా రోహిత్ శర్మ జట్టును నడిపిస్తున్నప్పటికీ, వయసు రీత్యా, ప్రస్తుత ఫామ్ రీత్యా అతనిపై భారీగా అంచనాలు ఉన్నాయి. 2027 ప్రపంచ కప్ సమయానికి రోహిత్‌ వయసు మరింత పెరుగుతుంది. ఇంగ్లాండ్‌లో జరిగే ఈ వన్డే సిరీస్‌లో రోహిత్ వ్యక్తిగతంగా భారీ పరుగులు సాధిస్తేనే, అతని భవిష్యత్తు ప్రణాళికలపై సెలెక్టర్లకు ఒక స్పష్టత వస్తుంది. విదేశీ గడ్డపై, ముఖ్యంగా పేస్ అండ్ బౌన్స్ ఉండే పిచ్‌లపై రోహిత్ బ్యాట్ ఝుళిపించడం అత్యవసరం.

రోహిత్ ఒక్కడే కాదు.. ఆ ముగ్గురి కెరీర్‌కు కూడా పరీక్షే..!

ఈ సిరీస్‌లో రోహిత్ శర్మతో పాటు ప్రధానంగా ముగ్గురు ఆటగాళ్లపై అందరి నిఘా ఉంది:

విరాట్ కోహ్లీ: రన్ మెషిన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో తిరుగులేని రికార్డులు కలిగి ఉన్నప్పటికీ, ఇటీవల కాలంలో వైట్ బాల్ క్రికెట్‌లో అతని ప్రదర్శనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ కప్ రేసులో నిలవాలంటే కోహ్లీ తన పాత ఫామ్‌ను అందుకొని భారీ సెంచరీలు బాదాల్సిందే.

ఇది కూడా చదవండి: అన్నీ గుండు సున్నాలే.. టీమిండియాను సర్వ నాశనం చేసిన ఆ ఇద్దరిని పీకేస్తే దరిద్రం పోతది..!

శ్రేయస్ అయ్యర్: మిడిలార్డర్ బాధ్యతలు మోస్తున్న వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్థానానికి ఇప్పుడు యువ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్, షార్ట్ పిచ్ బంతులను అయ్యర్ ఎలా ఎదుర్కొంటాడనేది అతని వన్డే కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ కానుంది.

కేఎల్ రాహుల్: వికెట్ కీపర్ బ్యాటర్‌గా జట్టులో స్థిరమైన స్థానం కోసం పోరాడుతున్న రాహుల్‌కు కూడా ఇది ఆఖరి అవకాశంగా మారే ప్రమాదం ఉంది. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు బెంచ్‌పై వేచి చూస్తుండటంతో, రాహుల్ ఖచ్చితంగా మెరుగైన ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us