AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Hazare Trophy: బ్యాట్ తో బాణాసంచాలు పేల్చిన కాటేరమ్మ కొడుకు! చేతులు కలిపిన పంజాబ్ ఆటగాడు

పంజాబ్ క్రికెట్ టీమ్‌కి చెందిన అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 298 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంతో విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. వారి ఈ అద్భుత ప్రదర్శన పంజాబ్‌ను 424 పరుగుల భారీ స్కోర్‌కు చేర్చింది, ఇది టోర్నీ చరిత్రలో ఐదవ అత్యధిక స్కోర్. అభిషేక్ తన 96 బంతుల్లో 170 పరుగులతో దూకుడుగా ఆడగా, ప్రభ్‌సిమ్రాన్ 95 బంతుల్లో 125 పరుగులతో ఆకట్టుకున్నాడు. వారి భాగస్వామ్యం భారతదేశ దేశవాళీ క్రికెట్‌లో ఎలైట్ లిస్ట్‌లో చేరింది.

Vijay Hazare Trophy: బ్యాట్ తో బాణాసంచాలు పేల్చిన కాటేరమ్మ కొడుకు! చేతులు కలిపిన పంజాబ్ ఆటగాడు
Abhishek Sharma
Narsimha
|

Updated on: Jan 01, 2025 | 12:15 PM

Share

మంగళవారం అహ్మదాబాద్‌లోని గుజరాత్ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో పంజాబ్ టీమ్‌కి చెందిన ఓపెనర్లు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచారు. సౌరాష్ట్రపై జరిగిన ఈ మ్యాచ్‌లో వారు 298 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని సాధించి టోర్నమెంట్ చరిత్రలో మరో రికార్డును నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం 2022లో బెంగాల్ ఆటగాళ్లు సుదీప్ ఘరామి, అభిమన్యు ఈశ్వరన్ నెలకొల్పిన రెండో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డును సమం చేసింది.

ప్రభ్‌సిమ్రాన్ తన సెంచరీని అందుకొని 95 బంతుల్లో 125 పరుగులు సాధించగా, అభిషేక్ మరింత ఆకర్షణీయంగా ఆడుతూ 96 బంతుల్లో 170 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉండగా, ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.

వారి మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన పంజాబ్‌ను 300 పరుగుల మార్క్ దాటేలా చేసింది, చివరికి 424 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. ఇది విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఐదవ అత్యధిక స్కోర్‌గా నిలిచింది. పంజాబ్ తమ ఆటతో 400 పరుగుల మార్క్‌ను అధిగమించిన తొమ్మిదో జట్టుగా చరిత్రలో నిలిచింది.

ఈ విజయం తో, అభిషేక్-ప్రభ్‌సిమ్రాన్ భాగస్వామ్యం దేశవాళీ క్రికెట్‌లో అత్యున్నత స్థాయి భాగస్వామ్యాల్లో ఒకటిగా మారింది.