BCCI జనవరి 18న ఇంగ్లాండ్ వన్డే, టీ20 సిరీస్లతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్, UAEలో జరుగుతుంది, భారత మ్యాచ్లు హైబ్రిడ్ మోడల్లో దుబాయ్లో జరుగుతాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీ కొనసాగించనుండగా, జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా అందుబాటులో ఉండకపోవచ్చు. BCCI క్రమశిక్షణా నిబంధనలు తీసుకురావడంతో జట్టు ఎంపికపై మరింత ఆసక్తి నెలకొంది.
- Narsimha
- Updated on: Jan 17, 2025
- 7:31 pm