AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy: పీసీబీ లక్ మార్చనున్న భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీతో కోట్ల వర్షం

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించే బాధ్యతను పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు అప్పగించారు. అయితే ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. భారత జట్టు దుబాయ్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడనుంది. ఇంతకుముందు పాకిస్తాన్ దీని వల్ల నష్టపోవాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు పీసీబీకి కోట్ల వర్షం కురవనుంది.

Champions Trophy: పీసీబీ లక్ మార్చనున్న భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీతో కోట్ల వర్షం
Ct 2025 Ind Vs Pak
Venkata Chari
|

Updated on: Jan 04, 2025 | 11:16 AM

Share

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్‌లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్నారు. తటస్థ వేదిక దుబాయ్‌లో భారత్ తన మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో పాక్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వాటిల్లుతుందని భావించారు. అయితే, దీనికి పరిహారంగా ఒక మార్గాన్ని కనుగొన్నారు. పాక్ లాటరీ ఛాంపియన్స్ ట్రోఫీలో మారబోతుంది. వాస్తవానికి, పాకిస్తాన్ మీడియా నివేదిక ప్రకారం, దుబాయ్‌లో జరిగే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ నుంచి పిసిబి చాలా సంపాదిస్తుంది. ఎందుకంటే, టిక్కెట్ డబ్బులో సగం పీసీబీకి వెళ్తుంది. భారత్‌తో పాటు దుబాయ్‌లో జరిగే మరో మూడు మ్యాచ్‌ల టిక్కెట్‌ ఆదాయంలో సగం కూడా పీసీబీకి చేరనుంది.

పీసీబీ ఒప్పందం..

ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్‌తో పిసిబి ఒప్పందం కుదుర్చుకోబోతోందని పాక్ మీడియా పేర్కొంది. దీనికి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలో అధికారికంగా లిఖితపూర్వకంగా సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం దుబాయ్‌లో జరిగే 4 మ్యాచ్‌ల నుంచి పీసీబీ సంపాదిస్తుంది. ఈసీబీ, పీసీబీ టికెట్ ధరలో సగం ఇవ్వనుంది.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం మొత్తం సామర్థ్యం 25 వేల మంది ప్రేక్షకులు ఉండనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ కూడా అక్కడే జరగనుంది. దీంతో పాటు దుబాయ్‌లో జరిగే గ్రూప్ దశలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో కూడా భారత్ తలపడనుంది. టోర్నీ సెమీఫైనల్ కూడా దుబాయ్ స్టేడియంలో జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లన్నింటిలోనూ హౌస్ ఫుల్ హౌస్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అంటే పీసీబీ కోట్లు సంపాదిస్తుంది. ఉదాహరణకు, టిక్కెట్లను విక్రయించడం ద్వారా ECB రూ. 100 కోట్లు సంపాదిస్తే, PCB రూ. 50 కోట్లు పొందుతుంది.

ఇవి కూడా చదవండి

భారత్ ఫైనల్ చేరితే నష్టమే..

అయితే, పీసీబీ తన డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాన్ని కనుగొంది. అయితే, ఫైనల్స్‌కు చేరుకోవడంలో భారత జట్టు విజయం సాధించినట్లయితే, అది కూడా నష్టపోయే అవకాశం ఉంది. దీని వెనుక కారణం ఏమిటంటే, టైటిల్ మ్యాచ్‌ను లాహోర్ నుంచి దుబాయ్‌కి మార్చవలసి ఉంటుంది. దీని కారణంగా, టిక్కెట్లు, ఇతర వనరుల నుంచి పాకిస్తాన్ డబ్బు సంపాదించదు.

అయితే, నివేదిక ప్రకారం, పాకిస్తాన్ బోర్డు హైబ్రిడ్ మోడల్‌కు పరిహారంగా 4.5 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 38 కోట్లు విడిగా ఇవ్వనుంది. ఇది కాకుండా, ఛాంపియన్స్ ట్రోఫీకి హోస్టింగ్ ఫీజుగా 65 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 558 కోట్లు ఇవ్వనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..