![ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/icc-champions-trophy.jpg)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
ICC ఛాంపియన్స్ ట్రోఫీని ” మినీ వరల్డ్ కప్ ” అని కూడా పిలుస్తారు. ” ఛాంపియన్స్ ట్రోఫీ ” ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్. 1998లో మొదలైంది. ఇందులో వన్డే ఫార్మాట్లో టోర్నీని నిర్వహిస్తుంటారు. మొదటి ఛాంపియన్స్ ట్రోఫీ బంగ్లాదేశ్లో జూన్ 1998లో నిర్వహించారు. ప్రస్తుతం 8 ఎడిషన్లు పూర్తయ్యాయి. ప్రస్తుత ఫార్మాట్ క్రికెట్ ప్రపంచ కప్ గత ఎడిషన్లో జరిగే క్వాలిఫికేషన్ దశను కలిగి ఉంటుంది. టోర్నమెంట్ దశకు ఏ జట్లు అర్హత సాధించాలో ఇది నిర్ణయించనుంది. ప్రపంచ కప్లో (ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చిన దేశంతో సహా) మొదటి ఎనిమిది ర్యాంక్లో ఉన్న జట్లు టోర్నమెంట్కు బెర్త్ను ఖాయం చేసుకుంటాయి. ఆస్ట్రేలియా , భారత్లు రెండుసార్లు టోర్నీని గెలుపొందగా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక , వెస్టిండీస్, పాకిస్థాన్లు ఒక్కోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచాయి. ఇంగ్లండ్లో జరిగిన 2017 టోర్నమెంట్లో పాకిస్తాన్ ఛాంపియన్గా నిలిచింది . 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్లో జరుగుతుంది.
IND vs PAK: ఆ రుజువు ఐసీసీకి ఇవ్వాల్సిందే: బీసీసీఐని ఇరకాటంలో పడేసిన పీసీబీ.. అదేంటంటే?
ICC Champions Trophy 2025: తదుపరి ఛాంపియన్స్ ట్రోఫీని వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో అంటే 2025లో నిర్వహించాలని నిర్ణయించారు. కాబట్టి టీమిండియాను పాకిస్థాన్కు పంపడానికి భారత ప్రభుత్వం నిరాకరిస్తే, దీనికి సంబంధించి మాకు రాతపూర్వక రుజువు కావాలి, ఈ రుజువును BCCI, ICCకి సమర్పించాలని పాక్ కోరిందంట. ఐదు నుంచి ఆరు నెలల సమయం ఉన్న టోర్నీ ప్రారంభానికి ముందే ఈ రాతపూర్వక రుజువు ఇవ్వాలని పీసీబీ పట్టుబట్టినట్లు సమాచారం.
- Venkata Chari
- Updated on: Jul 15, 2024
- 9:05 pm
Champions Trophy: బీసీసీఐకి షాక్ ఇచ్చిన పాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు రాకపోతే.. బెదిరింపులు షురూ చేసిన పీసీబీ
Champions Trophy 2025: ఒకవేళ భారత్ పాకిస్థాన్కు వెళ్లకపోతే, హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించవచ్చు. అయితే, మొత్తం టోర్నీని తమ దేశంలోనే నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భావిస్తోంది. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం, పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చే తన వైఖరి నుంచి పీసీబీ వెనక్కి తగ్గదు. ఈ వారం శ్రీలంకలో జరిగే ఐసీసీ సమావేశంలో బోర్డు అదే స్టాండ్లో ఉంటుంది.
- Venkata Chari
- Updated on: Jul 15, 2024
- 7:33 pm
Team India: ఆడకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ ఔట్.. ఆ జట్టుకు మాత్రం భారీగా ప్రయోజనం.. ఎందుకో తెలుసా?
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఐసీసీ ముందు పెద్ద సమస్య తలెత్తింది. ఒకవేళ టీమిండియా పాకిస్తాన్లో ఆడటానికి నిరాకరిస్తే, భారత్ లేకుండా ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి ఐసీసీ సిద్ధంగా ఉండదు. ఎందుకంటే ఇది టోర్నమెంట్ బ్రాండ్ విలువను తగ్గిస్తుంది. ఇది ఫ్లాప్ టోర్నమెంట్ అని నిరూపించుకోవచ్చు.
- Venkata Chari
- Updated on: Jul 12, 2024
- 2:45 pm
IND Vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ ఔట్.? కుప్పిగంతులు వేస్తే పాక్కు పగిలిపోయినట్టే
ఏది తెగే దాకా లాగకూడదు.. ఇది పెద్దలు చెప్పే మాట.. ఇక ఇప్పుడు ఈ మాటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సరిగ్గా సరిపోతుంది. ఇటీవల ఆ క్రికెట్ బోర్డు తెరపైకి తీసుకొచ్చిన ఓ అంశంపై బీసీసీఐకి తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. పెడితే హైబ్రిడ్ మోడల్ పెట్టాలి.. లేదంటే పాక్ వచ్చేది లేదు అంటోంది బీసీసీఐ. అటు పాక్ కూడా తగ్గేదేలే..
- Ravi Kiran
- Updated on: Jul 11, 2024
- 7:07 pm
Team India: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు.. ఆ ఏడుగురు ఔట్.. చాలా రోజుల తర్వాత స్వ్కాడ్లో చేరిన ఇద్దరు?
India Probable Team for Champions Trophy 2025: టీ20లో ప్రపంచ ఛాంపియన్గా మారిన తర్వాత, ఇప్పుడు భారత జట్టు ముందున్న తదుపరి అతిపెద్ద సవాలు ఛాంపియన్స్ ట్రోఫీ. వచ్చే ఏడాది పాకిస్థాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. టీం ఇండియా పాకిస్థాన్కు వెళ్లాలా వద్దా అనే విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఇప్పుడు సాధ్యమయ్యే జట్టును పరిశీలిస్తే, ఈ భారీ టోర్నమెంట్కు చాలా మంది ఆటగాళ్లను ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది.
- Venkata Chari
- Updated on: Jul 9, 2024
- 5:51 pm