
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
ICC ఛాంపియన్స్ ట్రోఫీని ” మినీ వరల్డ్ కప్ ” అని కూడా పిలుస్తారు. ” ఛాంపియన్స్ ట్రోఫీ ” ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్. 1998లో మొదలైంది. ఇందులో వన్డే ఫార్మాట్లో టోర్నీని నిర్వహిస్తుంటారు. మొదటి ఛాంపియన్స్ ట్రోఫీ బంగ్లాదేశ్లో జూన్ 1998లో నిర్వహించారు. ప్రస్తుతం 8 ఎడిషన్లు పూర్తయ్యాయి. ప్రస్తుత ఫార్మాట్ క్రికెట్ ప్రపంచ కప్ గత ఎడిషన్లో జరిగే క్వాలిఫికేషన్ దశను కలిగి ఉంటుంది. టోర్నమెంట్ దశకు ఏ జట్లు అర్హత సాధించాలో ఇది నిర్ణయించనుంది. ప్రపంచ కప్లో (ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చిన దేశంతో సహా) మొదటి ఎనిమిది ర్యాంక్లో ఉన్న జట్లు టోర్నమెంట్కు బెర్త్ను ఖాయం చేసుకుంటాయి. ఆస్ట్రేలియా , భారత్లు రెండుసార్లు టోర్నీని గెలుపొందగా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక , వెస్టిండీస్, పాకిస్థాన్లు ఒక్కోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచాయి. ఇంగ్లండ్లో జరిగిన 2017 టోర్నమెంట్లో పాకిస్తాన్ ఛాంపియన్గా నిలిచింది . 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్లో జరుగుతుంది.
Champions Trophy 2025: మాలాగే మీరు కూడా నష్టపోతారు! BCCI కి శాపనార్థాలు పెడుతున్న PCB ప్రతినిధి
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్లో నిర్వహించాలని నిర్ణయించడంతో భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం చెలరేగింది. భారత్ తన మ్యాచ్లను దుబాయ్లో ఆడటంతో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని వార్తలు వినిపించాయి. PCB దీనిని ఖండించినప్పటికీ, భారత మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించింది. భవిష్యత్తులో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్లు తటస్థ వేదికలలోనే జరుగుతాయని ఐసిసి ప్రకటించడంతో భారత అభిమానులకు నిరాశ కలిగింది.
- Narsimha
- Updated on: Mar 24, 2025
- 10:30 am
Champions Trophy: రోహిత్ సేనపై కాసుల వర్షం.. ఏకంగా రూ. 58 కోట్లు ప్రకటించిన బీసీసీఐ.. ఎందుకంటే?
BCCI Cash Prize for Team India: ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న టీం ఇండియాపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. రోహిత్ శర్మ నాయకత్వంలో ఛాంపియన్గా నిలిచిన జట్టుకు బీసీసీఐ రూ.58 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఆటగాళ్లు, కోచింగ్, సపోర్ట్ సిబ్బంది, సెలక్షన్ కమిటీ సభ్యులకు బోర్డు ప్రైజ్ మనీ ప్రకటించింది.
- Venkata Chari
- Updated on: Mar 20, 2025
- 12:10 pm
Video: PM మోదీతో న్యూజిలాండ్ ప్రధాని భేటీ! ఛాంపియన్స్ ట్రోఫీపై కామెంట్స్ కి నవ్వుల్ నవ్వుల్
భారత్లో అధికారిక పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రస్తావన ఆసక్తికరంగా మారింది. లక్సన్ తన సరదా వ్యాఖ్యలతో ప్రధాని మోదీ సహా సమావేశంలో ఉన్నవారిని నవ్వుల్లో ముంచెత్తారు. మార్చి 9, 2025న దుబాయ్లో జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయంతో భారత క్రికెట్ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, మరో గొప్ప ఘనతను సాధించింది.
- Narsimha
- Updated on: Mar 18, 2025
- 11:26 am
PCB: ఇండియా దెబ్బ పాకిస్తాన్ అబ్బా! పాపం పాకీల ఆదాయం 1 అయితే, వ్యయం 10 అన్నట్లు అయిందిగా!
2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్కు భారీ ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. భారత జట్టు పాకిస్తాన్లో ఆడకపోవడంతో టిక్కెట్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. వర్షం ప్రభావంతో కొన్ని కీలక మ్యాచ్లు రద్దవ్వడంతో, ప్రసార హక్కుల ద్వారా వచ్చే ఆదాయమూ భారీగా తగ్గిపోయింది. మొత్తం రూ. 7,445 కోట్ల నష్టంతో PCB భవిష్యత్తు మరింత సంక్షోభంలో పడే అవకాశం ఉంది.
- Narsimha
- Updated on: Mar 17, 2025
- 11:15 am
Virat Kohli: కింగ్ ఫ్యాన్స్ కి బాడ్ న్యూస్! ఆ విషయంలో ధోనిని ఫాలో అవుతున్న కోహ్లీ
భారత క్రికెట్ జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచినా, విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఈ నిర్ణయం అతని అభిమానుల్లో ఆశ్చర్యం, అసంతృప్తిని కలిగించింది. RCB ఇన్నోవేషన్ ల్యాబ్లో మాట్లాడుతూ, అతను సోషల్ మీడియా పై శ్రద్ధ తగ్గించానని చెప్పాడు. ప్రస్తుతం కోహ్లీ RCB శిక్షణలో పాల్గొంటున్నా, అతని మౌనం అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.
- Narsimha
- Updated on: Mar 16, 2025
- 9:59 am
Team India: ఏంటీ! ఈ టీమిండియా క్రికెటర్ సినిమాల్లోనూ నటించాడా? ఎవరో గుర్తు పట్టారా?
సాధారణంగా రిటైరైన క్రికెటర్లు ఎక్కువగా రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ అడుగు పెడుతుంటారు. ఈ మధ్యన శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ తదితర రిటైరైన క్రికెటర్లు టీవీషోలు, సినిమాల్లో కనిపించారు. అయితే ఈ టీమిండియా క్రికెటర్ అరంగేట్రానికి ముందే ఓ సినిమాలో మెరిశాడు.
- Basha Shek
- Updated on: Mar 15, 2025
- 7:19 pm
Rohit Sharma: ఐపీఎల్ కి ముందు రిలాక్స్ మోడ్లోకి రోహిత్.. ఫ్యామిలీతో కలిసి ఏం చేస్తున్నాడో తెలుసా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన తర్వాత రోహిత్ శర్మ తన భార్య, కుమార్తెతో కలిసి మాల్దీవుల్లో సెలవులు ఎంజాయ్ చేస్తున్నాడు. గట్టి షెడ్యూల్కు ముందు విశ్రాంతి తీసుకుంటూ, తన ఫ్యామిలీతో ప్రశాంతమైన సమయాన్ని గడుపుతున్నాడు. రోహిత్ తన IPL 2025 ప్రదర్శనతో ఎలా రాణిస్తాడో చూడాల్సిందే. త్వరలో భారత జట్టు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో తలపడనుంది.
- Narsimha
- Updated on: Mar 15, 2025
- 10:34 am
Video: గాల్లోకి ఎగురుతున్న కివీస్ పక్షి! ఈ జమానాలో ఇతడే బెస్ట్ ఫీల్డర్.. ఒక్కో క్యాచ్ ఒక్కో డైమాండ్
న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ తన అసాధారణమైన ఫీల్డింగ్ నైపుణ్యంతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అతను చేసిన గ్రావిటీ-డిఫైయింగ్ క్యాచ్లు మ్యాచ్ల విజయంలో కీలకంగా మారాయి. చిన్నతనం నుండి వివిధ క్రీడల్లో సాధన చేయడం వల్ల అతని ఫీల్డింగ్ నైపుణ్యాలు మరింత పదునెక్కాయి. ఫీల్డింగ్ను కొత్త ఎత్తుకు తీసుకెళ్లే తన ప్రతిభతో యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తున్నాడు.
- Narsimha
- Updated on: Mar 14, 2025
- 8:34 am
Virat Kohli: కోహ్లీ వల్లే 14 ఏళ్ళ బాలిక మృతి? క్లారిటీ ఇచ్చిన ప్రియాంశి తండ్రి!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ సందర్భంగా 14 ఏళ్ల బాలిక ప్రియాంశి హఠాన్మరణం చెందింది. విరాట్ కోహ్లీ ఔటైన వెంటనే ఆమె మరణించిందని కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే బాలిక తండ్రి అజయ్ పాండే దీనిని ఖండిస్తూ, ఇది కేవలం యాధృచ్ఛిక సంఘటన అని తెలిపారు. తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, నిజాన్ని అర్థం చేసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
- Narsimha
- Updated on: Mar 14, 2025
- 6:07 am
Champions Trophy: మీడియాకు షాకిచ్చిన కెప్టెన్ కూల్! ట్రోఫీ గెలుపుపై ఏమన్నాడంటే?
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించినా, ధోని దీనిపై స్పందించకుండా ఉండటం చర్చనీయాంశమైంది. విలేకరి ప్రశ్నించగా, ధోని ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్, ధోనితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. 2025 IPLలో ధోని CSK తరఫున ఆడనున్నప్పటికీ, ఇది అతని చివరి సీజనా? అనే ప్రశ్న అందరిలో ఆసక్తిని పెంచుతోంది.
- Narsimha
- Updated on: Mar 13, 2025
- 9:25 pm