
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
ICC ఛాంపియన్స్ ట్రోఫీని ” మినీ వరల్డ్ కప్ ” అని కూడా పిలుస్తారు. ” ఛాంపియన్స్ ట్రోఫీ ” ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్. 1998లో మొదలైంది. ఇందులో వన్డే ఫార్మాట్లో టోర్నీని నిర్వహిస్తుంటారు. మొదటి ఛాంపియన్స్ ట్రోఫీ బంగ్లాదేశ్లో జూన్ 1998లో నిర్వహించారు. ప్రస్తుతం 8 ఎడిషన్లు పూర్తయ్యాయి. ప్రస్తుత ఫార్మాట్ క్రికెట్ ప్రపంచ కప్ గత ఎడిషన్లో జరిగే క్వాలిఫికేషన్ దశను కలిగి ఉంటుంది. టోర్నమెంట్ దశకు ఏ జట్లు అర్హత సాధించాలో ఇది నిర్ణయించనుంది. ప్రపంచ కప్లో (ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చిన దేశంతో సహా) మొదటి ఎనిమిది ర్యాంక్లో ఉన్న జట్లు టోర్నమెంట్కు బెర్త్ను ఖాయం చేసుకుంటాయి. ఆస్ట్రేలియా , భారత్లు రెండుసార్లు టోర్నీని గెలుపొందగా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక , వెస్టిండీస్, పాకిస్థాన్లు ఒక్కోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచాయి. ఇంగ్లండ్లో జరిగిన 2017 టోర్నమెంట్లో పాకిస్తాన్ ఛాంపియన్గా నిలిచింది . 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్లో జరుగుతుంది.
Champions Trophy: ఇండియాతో మ్యాచ్ ఓడినా పర్వాలేదు.. కానీ! పాక్ వైస్ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఈ నెల 19 నుంచి ప్రారంభం కాబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అంతా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ మ్యాచ్పై పాకిస్థాన్ వైస్ కెప్టెన్ అఘా సల్మాన్ స్పందిస్తూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతను ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
- SN Pasha
- Updated on: Feb 16, 2025
- 3:11 pm
స్వదేశం వద్దంటే.. ముంబై రమ్మంది! వచ్చే ఐపీఎల్ కోసం ముంబై ఇండియన్స్లోకి స్టార్ స్పిన్నర్
ఓ స్టార్ ప్లేయర్ను ఆ దేశపు జట్టులోకి తీసుకోలేదు. కానీ, వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ మాత్రం అతన్ని అక్కున చేర్చుకుంది. ఆ ప్లేయర్ను స్వదేశం వద్దన్నా.. ముంబై రూపంలో అదృష్టం తలుపుతట్టింది. మరి ఆ లక్కీ ప్లేయర్ ఎవరు? ముంబై ఎందుకు అతన్ని తీసుకుందో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
- SN Pasha
- Updated on: Feb 16, 2025
- 1:21 pm
భారీ ఎదురుదెబ్బ.. టీమిండియా స్టార్ ఓపెనర్కు గాయం! ప్రతిష్టాత్మక ట్రోఫీకి దూరం!
ఒక వైపు భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఆటగాళ్లంతా దుబాయ్కి చేరుకున్నారు. ఈ నెల 20న బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్తో టీమిండియా తమ ఛాంపియన్స్ ట్రోఫీ వేటను మొదలుపెట్టనుంది. మరోవైపు డొమెస్టిక్ క్రికెట్లో ముంబై జట్టు రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ను రేపటి నుంచి ఆడనుంది. ఈ క్రమంలో ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, టీమిండియా ఆటగాడు గాయపడ్డాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
- SN Pasha
- Updated on: Feb 16, 2025
- 12:51 pm
గంభీర్తో గొడవకు దిగిన చీఫ్ సెలెక్టర్ అగార్కర్! ఆ ఇద్దరి గురించే అంతా..
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య గరం గరం చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే కంటే ముందు జరిగిన టీమ్ మీడియాలో వీరిద్దమ మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది సమాచారం. దాని గురించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..
- SN Pasha
- Updated on: Feb 16, 2025
- 12:20 pm
IPL 2025: ఢిల్లీ కెప్టెన్ రేసులో ఆ ముగ్గురు.. కానీ పట్టాభిషేకం మాత్రం అతనికే అంటున్న భారత మాజీ క్రికెటర్
ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్గా అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్లలో ఎవరు ఎంపిక అవుతారన్నది హాట్ టాపిక్గా మారింది. అక్షర్ పటేల్ భారత వైస్ కెప్టెన్గా ఉన్న నేపథ్యంలో అతనికి ఎక్కువ అవకాశం ఉండొచ్చని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు. మరోవైపు, RCB కొత్త కెప్టెన్గా రజత్ పాటిదార్ను ప్రకటించడం క్రికెట్ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. ఈ కీలక మార్పులు ఐపీఎల్ 2025లో ఏ విధంగా ప్రభావం చూపుతాయో చూడాలి-
- Narsimha
- Updated on: Feb 16, 2025
- 11:43 am
Arshdeep Singh: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా యంగ్ బౌలర్ కి మాస్ వార్నింగ్ ఇచ్చిన ఇంగ్లాండ్ లెజెండ్!
భారత బౌలింగ్ విభాగానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది, జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో, అర్ష్దీప్ సింగ్ కీలకంగా మారడంతో, అతని అనుభవ రాహిత్యం భారత బౌలింగ్పై ప్రభావం చూపనుందని డేవిడ్ లాయిడ్ హెచ్చరించారు. వన్డే ఫార్మాట్లో 10 ఓవర్లు బౌలింగ్ చేయడం T20 కంటే చాలా కష్టం అని, అర్ష్దీప్కు ఇది ఒక అసాధారణ పరీక్ష అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే, BCCI ధీమాగా ఉండగా, అర్ష్దీప్ ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.
- Narsimha
- Updated on: Feb 16, 2025
- 11:31 am
ఇకపై అలాంటి ఆటలు సాగవ్..! ఛాంపియన్స్ ట్రోఫీ ముందు స్టార్ ప్లేయర్కు షాకిచ్చిన బీసీసీఐ!
మరో నాలుగు రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఈ రోజు అంటే ఫిబ్రవరి 15న భారత ఆటగాళ్లు దుబాయ్కి వెళ్లనున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఎలాగైన ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఆటగాళ్లంతా ఉన్నారు. అలాగే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా టీమిండియా ఎలాగైనా కప్పు కొట్టాలని బలంగా కోరుకుంటున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లకు ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ కావొచ్చని చాలా మంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో కప్పు కొడితే బాగుటుందని అనుకుంటున్నారు.
- SN Pasha
- Updated on: Feb 15, 2025
- 6:01 pm
Champions Trophy 2025: ఆ ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నమెంట్.. కప్ గెలిచి గుడ్ బై చెబుతారా?
ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ మినీ వరల్డ్ కప్ గెలిచేందుకు భారత్ తో సహా ప్రపంచంలోని 8 అత్యుత్తమ జట్లు పోటీ పడుతున్నాయి. అయితే టీమిండియాలోని కొందరు దిగ్గజాలకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నమెంట్ అని తెలుస్తోంది.
- Basha Shek
- Updated on: Feb 15, 2025
- 5:14 pm
Champions Trophy: టీమిండియాలో ఒక్కటే లోపం! ఇంగ్లండ్ మాజీకి అర్థమైంది.. మనోళ్లకే కాట్లేదు!
ఛాంపియన్స్ ట్రోఫీ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ టీమిండియాకు ఉన్న లోపాన్ని ఎత్తిచూపాడు. దాంతో అవును కదా.. ఇదేందుకు భారత సెలెక్టర్లకు తట్టలేదు అనే డౌట్ క్రికెట్ అభిమానుల్లోనూ మొదలైంది. ఇంతకీ టీమిండియాకు ఉన్న లోపం, ఇంగ్లండ్ మాజీ చెప్పిన అంశం ఏంటో ఇప్పుడు చూద్దాం..
- SN Pasha
- Updated on: Feb 15, 2025
- 5:11 pm
పాకిస్థానోళ్లంటార్రా బాబు! న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఏం చేశారో మీరే చూడండి!
పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య ట్రై సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శనకు పాక్ పిచ్చితనం కూడా తోడై.. కివీస్ జట్టుకు విజయం చేకూరింది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఆటగాళ్లు చేసిన కొన్ని తప్పిదాలతో నవ్వుల పాలవుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- SN Pasha
- Updated on: Feb 15, 2025
- 12:48 pm