ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
ICC ఛాంపియన్స్ ట్రోఫీని ” మినీ వరల్డ్ కప్ ” అని కూడా పిలుస్తారు. ” ఛాంపియన్స్ ట్రోఫీ ” ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్. 1998లో మొదలైంది. ఇందులో వన్డే ఫార్మాట్లో టోర్నీని నిర్వహిస్తుంటారు. మొదటి ఛాంపియన్స్ ట్రోఫీ బంగ్లాదేశ్లో జూన్ 1998లో నిర్వహించారు. ప్రస్తుతం 8 ఎడిషన్లు పూర్తయ్యాయి. ప్రస్తుత ఫార్మాట్ క్రికెట్ ప్రపంచ కప్ గత ఎడిషన్లో జరిగే క్వాలిఫికేషన్ దశను కలిగి ఉంటుంది. టోర్నమెంట్ దశకు ఏ జట్లు అర్హత సాధించాలో ఇది నిర్ణయించనుంది. ప్రపంచ కప్లో (ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చిన దేశంతో సహా) మొదటి ఎనిమిది ర్యాంక్లో ఉన్న జట్లు టోర్నమెంట్కు బెర్త్ను ఖాయం చేసుకుంటాయి. ఆస్ట్రేలియా , భారత్లు రెండుసార్లు టోర్నీని గెలుపొందగా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక , వెస్టిండీస్, పాకిస్థాన్లు ఒక్కోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచాయి. ఇంగ్లండ్లో జరిగిన 2017 టోర్నమెంట్లో పాకిస్తాన్ ఛాంపియన్గా నిలిచింది . 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్లో జరుగుతుంది.
ICC Tournaments: 5 ఏళ్లు.. 9 టోర్నమెంట్లు.. భారత్ ఆతిథ్యం ఇచ్చేది ఎన్నంటే..?
ICC Tournaments 2026 To 2031: ఐసీసీ 2026, 2031 మధ్య మొత్తం 9 టోర్నమెంట్లను నిర్వహించనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ మినహా అన్ని టోర్నమెంట్లను సంయుక్తంగా నిర్వహించడం విశేషం. అదేవిధంగా, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లు కూడా ఇంగ్లాండ్లో జరుగుతాయి.
- Venkata Chari
- Updated on: Jul 21, 2025
- 4:17 pm
WTC Final 2025: పాత జ్ఞాపకాలను పాతాళంలానికి తొక్కేసాం! సఫారీ డాషింగ్ బ్యాటర్ పవర్ ఫుల్ కామెంట్స్
WTC ఫైనల్ను ముందుగా చూసుకుంటూ దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ ఐడెన్ మార్క్రామ్ గట్టిగా స్పందించాడు. గతంలో టీ20 వరల్డ్ కప్లో ఎదురైన చేదు అనుభవాలను జట్టు పూర్తిగా మరిచిపోయిందని, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జట్టు అని పేర్కొన్నాడు. ఆసీస్ బౌలింగ్ను ఎదుర్కొనడం సవాలుగా ఉన్నా, దానిపై నమ్మకంతో ఉన్నామని తెలిపాడు. లార్డ్స్ వేదికపై ఫైనల్ ఆడటం గర్వంగా ఉందని, దక్షిణాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉందని ధైర్యంగా చెప్పాడు.
- Narsimha
- Updated on: Jun 9, 2025
- 4:27 pm
Video: మాస్ రివేంజ్! పాక్ స్పిన్నర్ ని గ్రౌండ్ లోనే నిలదీసిన గిల్ లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్
న్యూజిలాండ్లో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను ఓ భారతీయ మహిళా అభిమాని ప్రశ్నించడంతో వీడియో వైరల్ అయింది. శుబ్మన్ గిల్పై గతంలో చేసిన వికెట్ సెలబ్రేషన్ గురించి ఆమె క్వశ్చన్ చేయగా, అబ్రార్ అసహనంగా నవ్వుతూ తప్పించుకున్నాడు. పాకిస్తాన్ వరుసగా మరో ఓటమిని మూటగట్టుకోగా, ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భారత అభిమానులు దీన్ని ట్రోల్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తుండగా, పాక్ అభిమానుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
- Narsimha
- Updated on: Apr 3, 2025
- 12:55 pm
Champions Trophy 2025: మాలాగే మీరు కూడా నష్టపోతారు! BCCI కి శాపనార్థాలు పెడుతున్న PCB ప్రతినిధి
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్లో నిర్వహించాలని నిర్ణయించడంతో భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం చెలరేగింది. భారత్ తన మ్యాచ్లను దుబాయ్లో ఆడటంతో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని వార్తలు వినిపించాయి. PCB దీనిని ఖండించినప్పటికీ, భారత మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించింది. భవిష్యత్తులో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్లు తటస్థ వేదికలలోనే జరుగుతాయని ఐసిసి ప్రకటించడంతో భారత అభిమానులకు నిరాశ కలిగింది.
- Narsimha
- Updated on: Mar 24, 2025
- 10:30 am
Champions Trophy: రోహిత్ సేనపై కాసుల వర్షం.. ఏకంగా రూ. 58 కోట్లు ప్రకటించిన బీసీసీఐ.. ఎందుకంటే?
BCCI Cash Prize for Team India: ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న టీం ఇండియాపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. రోహిత్ శర్మ నాయకత్వంలో ఛాంపియన్గా నిలిచిన జట్టుకు బీసీసీఐ రూ.58 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఆటగాళ్లు, కోచింగ్, సపోర్ట్ సిబ్బంది, సెలక్షన్ కమిటీ సభ్యులకు బోర్డు ప్రైజ్ మనీ ప్రకటించింది.
- Venkata Chari
- Updated on: Mar 20, 2025
- 12:10 pm
Video: PM మోదీతో న్యూజిలాండ్ ప్రధాని భేటీ! ఛాంపియన్స్ ట్రోఫీపై కామెంట్స్ కి నవ్వుల్ నవ్వుల్
భారత్లో అధికారిక పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రస్తావన ఆసక్తికరంగా మారింది. లక్సన్ తన సరదా వ్యాఖ్యలతో ప్రధాని మోదీ సహా సమావేశంలో ఉన్నవారిని నవ్వుల్లో ముంచెత్తారు. మార్చి 9, 2025న దుబాయ్లో జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయంతో భారత క్రికెట్ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, మరో గొప్ప ఘనతను సాధించింది.
- Narsimha
- Updated on: Mar 18, 2025
- 11:26 am
PCB: ఇండియా దెబ్బ పాకిస్తాన్ అబ్బా! పాపం పాకీల ఆదాయం 1 అయితే, వ్యయం 10 అన్నట్లు అయిందిగా!
2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్కు భారీ ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. భారత జట్టు పాకిస్తాన్లో ఆడకపోవడంతో టిక్కెట్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. వర్షం ప్రభావంతో కొన్ని కీలక మ్యాచ్లు రద్దవ్వడంతో, ప్రసార హక్కుల ద్వారా వచ్చే ఆదాయమూ భారీగా తగ్గిపోయింది. మొత్తం రూ. 7,445 కోట్ల నష్టంతో PCB భవిష్యత్తు మరింత సంక్షోభంలో పడే అవకాశం ఉంది.
- Narsimha
- Updated on: Mar 17, 2025
- 11:15 am
Virat Kohli: కింగ్ ఫ్యాన్స్ కి బాడ్ న్యూస్! ఆ విషయంలో ధోనిని ఫాలో అవుతున్న కోహ్లీ
భారత క్రికెట్ జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచినా, విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఈ నిర్ణయం అతని అభిమానుల్లో ఆశ్చర్యం, అసంతృప్తిని కలిగించింది. RCB ఇన్నోవేషన్ ల్యాబ్లో మాట్లాడుతూ, అతను సోషల్ మీడియా పై శ్రద్ధ తగ్గించానని చెప్పాడు. ప్రస్తుతం కోహ్లీ RCB శిక్షణలో పాల్గొంటున్నా, అతని మౌనం అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.
- Narsimha
- Updated on: Mar 16, 2025
- 9:59 am
Team India: ఏంటీ! ఈ టీమిండియా క్రికెటర్ సినిమాల్లోనూ నటించాడా? ఎవరో గుర్తు పట్టారా?
సాధారణంగా రిటైరైన క్రికెటర్లు ఎక్కువగా రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ అడుగు పెడుతుంటారు. ఈ మధ్యన శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ తదితర రిటైరైన క్రికెటర్లు టీవీషోలు, సినిమాల్లో కనిపించారు. అయితే ఈ టీమిండియా క్రికెటర్ అరంగేట్రానికి ముందే ఓ సినిమాలో మెరిశాడు.
- Basha Shek
- Updated on: Mar 15, 2025
- 7:19 pm
Rohit Sharma: ఐపీఎల్ కి ముందు రిలాక్స్ మోడ్లోకి రోహిత్.. ఫ్యామిలీతో కలిసి ఏం చేస్తున్నాడో తెలుసా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన తర్వాత రోహిత్ శర్మ తన భార్య, కుమార్తెతో కలిసి మాల్దీవుల్లో సెలవులు ఎంజాయ్ చేస్తున్నాడు. గట్టి షెడ్యూల్కు ముందు విశ్రాంతి తీసుకుంటూ, తన ఫ్యామిలీతో ప్రశాంతమైన సమయాన్ని గడుపుతున్నాడు. రోహిత్ తన IPL 2025 ప్రదర్శనతో ఎలా రాణిస్తాడో చూడాల్సిందే. త్వరలో భారత జట్టు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో తలపడనుంది.
- Narsimha
- Updated on: Mar 15, 2025
- 10:34 am