AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ఐపీఎల్‌ బెట్టింగ్‌ స్కామ్‌లో ధోనిపై సంచలన ఆరోపణలు.. ఐపీఎస్ ఆఫీసర్‌కు 15 రోజుల జైలు శిక్ష‌

ధోని 2013 ఐపీఎల్ సమయంలో బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్‌లకు పాల్పడ్డాడంటూ సంచలన ఆరోపణలు చేశారు సంపత్ కుమార్ . దీంతో ధోని కోర్టును ఆశ్రయించారు. పరువు నష్టం దావా వేశాడు. తాజాగా ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జీ సంపత్‌ కు 15 రోజుల జైలు శిక్ష విధించింది.

MS Dhoni: ఐపీఎల్‌ బెట్టింగ్‌ స్కామ్‌లో ధోనిపై సంచలన ఆరోపణలు.. ఐపీఎస్ ఆఫీసర్‌కు 15 రోజుల జైలు శిక్ష‌
Ms Dhoni
Basha Shek
|

Updated on: Dec 15, 2023 | 5:08 PM

Share

ఐపీఎల్ 2013 బెట్టింగ్ స్కాండల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌ కారణంగానే చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లపై నిషేధం కూడా విధించారు. అయితే ఇదే స్కామ్‌కు సంబంధించి అప్పట్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జీ సంపత్ కుమార్‌ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ధోని 2013 ఐపీఎల్ సమయంలో బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్‌లకు పాల్పడ్డాడంటూ సంచలన ఆరోపణలు చేశారు సంపత్ కుమార్ . దీంతో ధోని కోర్టును ఆశ్రయించారు. పరువు నష్టం దావా వేశాడు. తాజాగా ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జీ సంపత్‌ కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు శుక్రవారం జస్టిస్‌ ఎస్‌ఎస్‌ సుందర్‌, జస్టిస్‌ సుందర్‌ మోహన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం (డిసెంబర్‌ 15) తీర్పును వెలువరించింది. అయితే ఈ 15 రోజుల శిక్షపై అప్పీలు చేసుకోవడానికి సంపత్ కుమార్‌కు 30 రోజుల గడువు ఇచ్చింది. ఇదే విషయమై గతంలో కొన్ని మీడియా సంస్థలు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ తదితరులపై ధోనీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. 2013 ఐపీఎల్ సమయంలో బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్‌లకు పాల్పడ్డాడంటూ తనపై దురుద్దేశపూర్వకమైన ప్రకటనలు, నివేదికలు ఇచ్చారని ధోని కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో సంపత్ కుమార్ తదితరులు తనపై తప్పుడు ప్రకటనలు చేయకుండా లేదా ప్రచురించకుండా అడ్డుకోవాలని ధోనీ విజ్ఞప్తి చేశాడు.

ఈ కేసును విచారించిన హైకోర్టు, ధోనీపై పరువు నష్టం కలిగించే ప్రకటనలు ఇవ్వకుండా మీడియా సంస్థలు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ తదితరులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అందరూ కోర్టు ఆదేశాలను ఫాలో అయ్యారు. అయితే కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత కూడా బెట్టింగ్ స్కామ్‌ కేసుకు సంబంధించి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధోనీ కోర్టును ఆశ్రయించాడు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువరించింది. రిటైర్డ్ ఐపిఎస్ అధికారికి 15 రోజుల జైలు శిక్ష విధించింది.

ఇవి కూడా చదవండి

ధోని ఏడో నెంజర్ జెర్సీ పై బీసీసీఐ కీలక నిర్ణయం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్
JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే
JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే
కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..
కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!