AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 Cricket: సూపర్ ఓవర్‌కు చేరిన మ్యాచ్.. నరాలు తెగే ఉత్కంఠ.. క్రీజులో హిట్‌మ్యాన్.. రిజల్ట్ ఎలా ఉందంటే?

India vs New Zealand: సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. దాని ముగింపు భారత అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

T20 Cricket: సూపర్ ఓవర్‌కు చేరిన మ్యాచ్.. నరాలు తెగే ఉత్కంఠ.. క్రీజులో హిట్‌మ్యాన్.. రిజల్ట్ ఎలా ఉందంటే?
India Vs New Zealand
Venkata Chari
|

Updated on: Jan 29, 2023 | 10:49 AM

Share

భారత్-న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్‌లో ఉత్కంఠ మొదలైంది. తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య భారత్‌కు న్యూజిలాండ్ టీం గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పుడు రెండో మ్యాచ్ లక్నోలో జరగబోతోంది. ఇక్కడ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేసేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌ను టీమిండియా గెలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు ఈ మ్యాచ్‌లో సత్తా చూపాల్సి ఉంటుంది.

అయితే, 2020లో ఇదే రోజున అంటే జనవరి 29 జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లోనూ ఇలాంటిదే జరిగింది. ఫార్మాట్ కూడా టీ20. అదేమిటంటే సరిగ్గా 3 ఏళ్ల క్రితం భారత్, న్యూజిలాండ్ జట్లు ఈసారి మాదిరిగానే టీ20 మ్యాచ్‌లో తలపడ్డాయి. స్థలం మాత్రమే తేడా. మూడేళ్ల క్రితం న్యూజిలాండ్‌లోని హామిల్టన్‌లో ఈ ఘర్షణ జరగగా, ఈసారి లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇది భారత అభిమానులు మరచిపోలేని మ్యాచ్. టీమిండియా దీనిని గుర్తుంచుకోవాల్సిన తరుణం ఇది. ఆ విజయాన్ని మళ్లీ పునరావృతం చేయాల్సి ఉంటుంది.

ఉత్కంఠభరితమైన మ్యాచ్..

3 సంవత్సరాల క్రితం ఇరు జట్లు తలపడినప్పుడు, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లోని మూడవ మ్యాచ్ హామిల్టన్‌లో జరిగింది. అక్కడ రోహిత్ శర్మ అద్భుతంగా 65 పరుగుల ఇన్నింగ్స్ సహాయంతో భారత్ 179 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కూడా తగిన సమాధానం ఇచ్చింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 95 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆధారంగా, విజయం దిశగా అడుగులు వేసింది.

ఇవి కూడా చదవండి

ఇక చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం. అయితే మొహమ్మద్ షమీ మొదట విలియమ్సన్‌ను, చివరి బంతికి రాస్ టేలర్‌ను అవుట్ చేసి మ్యాచ్‌ని టై చేశాడు.

రోహిత్ వరుసగా 2 సిక్సర్లు..

ఆ తర్వాత ఏం జరిగిందో భారత అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్ 17 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 4 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేయగలిగారు. చివరి రెండు బంతుల్లో భారత్‌కు 10 పరుగులు అవసరం కాగా.. రోహిత్ శర్మ రెండు సంచలన సిక్సర్లు బాది భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఈ విజయంతో భారత్ తొలిసారిగా న్యూజిలాండ్‌లో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈసారి సిరీస్ ఓటమి నుంచి టీమిండియా తప్పించుకోవాలని చూస్తోంది. ఇందుకోసం ఆ మ్యాచ్ మూడో వార్షికోత్సవం రోజున టీమిండియా ఇలాంటివి చేయాల్సి ఉంది. సూపర్ ఓవర్ లేకుండా చేస్తేనే మంచిది. అయితే, ఈ మ్యాచ్‌లోని ప్లేయింగ్ ఎలెవన్‌లో, యుజ్వేంద్ర చాహల్ మాత్రమే ప్రస్తుత జట్టులో భాగంగా ఉన్నాడు. ఆ సమయంలో హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరంగా ఉండగా, సూర్యకుమార్ యాదవ్ అప్పటి వరకు అరంగేట్రం చేయలేదు. ఏది ఏమైనా తమ ప్రదర్శనతో జట్టును గెలిపించాల్సిన బాధ్యత ఇద్దరిపైనా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..