AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konaseema: 47 తర్వాత ఘనంగా దాసులమ్మ పంటల జాతర.. సారె, గండ్ర దీపాలు సమర్పించిన మహిళలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిలాల్లో ముమ్మిడివరం మండలం చెయ్యేరు లో అంగరంగ వైభవంగా దాసులమ్మ పంటల జాతర జరిగింది. అమ్మవారి అనుగ్రహం ఉండాలని.. తమ గ్రామంలో కరువుకాటకాలు రాకుండా సుభిక్షంగా ఉందని జాతరను జరుపుకున్నారు. గ్రామానికి చెందిన ఆడపడుచులు, కోడళ్ళు అందరూ అఖండ జ్యోతిని వెలిగించి ఊరేగింపుగా ఆలయానికి తరలి వెళ్లి సమర్పించారు.

Konaseema: 47 తర్వాత ఘనంగా దాసులమ్మ పంటల జాతర.. సారె, గండ్ర దీపాలు సమర్పించిన మహిళలు
Panta Jatara In Konaseema
Surya Kala
|

Updated on: Oct 14, 2025 | 7:50 PM

Share

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చెయ్యేరు లో గ్రామ దేవత దాసులమ్మ పంటల జాతర 47 ఏళ్ల తరువాత అంగరంగ వైభవం గా నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతులు పంటలు పుష్కలంగా పండి గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ అమ్మవారికి అఖండ దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామం లో వేలాది మంది మహిళలు (ఆడపడుచులు,కొడళ్లు బంధువులు) అందరూ తమ ఇంటి వద్ద అఖండ జ్యోతి ని వెలిగించి.. ఆ జ్యోతిని నెత్తిమీద పెట్టుకుని పసుపు, కుంకుమలు, వివిధ రకాల పిండి వంట తో ఊరంతా తిరిగి ఊరేగింపు గా తరలి వెళ్లి అమ్మవారికి సారె, గండ్ర దీపాలను సమర్పించారు.

వివిధ రకాల ఆహార పదార్ధాలను నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామస్తులు తీసుకువచ్చిన నైవేద్యాలను అమ్మవారికి కుంభంగా పోశారు. అనంతరం ఆ ప్రసాదాన్ని గ్రామంలో ఇంటి ఇంటికి పంచుతారు. ఇలా చేయడం ఇక్కడ ఆనవాయితి. అంతేకాదు అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని విశ్వసిస్తారు. వాస్తవంగా దాసులమ్మ పంటల జాతర ప్రతీ ఐదేళ్లకోసారి జరుపుకునెవరు. అయితే ఈ జాతరను కొన్నేళ్లుగా నిలిపివేశారు. దీంతో ఆనావృష్టి తో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు భావించి 47 ఏళ్ల తరువాత మరలా ఈ జాతర వైభవంగా జరుపుతునట్లు గ్రామస్థులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..