Rain Alert: అబ్బ సాయిరాం.. తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. రెండ్రోజుల పాటు వర్షాలు
Telugu states rain forecast: మార్చి మొదటి వారం నుంచే మాడు పగిలే ఎండలతో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న జనాలకు భారత వాతావరశాఖ చల్లటి కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు కురవనున్నట్టు పేర్కొంది. మరాత్వాడ ప్రాంతం నుండి దక్షిణ అంతర్గత కర్నాటక వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు మరాత్వాడ నుండి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత తమిళనాడు వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోందని ఈ కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
